Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుదిరిన పదవుల డీల్.. నేడు కుమార పట్టాభిషేకం.. చంద్రబాబు హాజరు

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ముఖ్యంగా, ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఇరు పార్టీల మధ్య మంత్రిపదవుల పంపిణీపై డీల్ కుదిరింది. ఈ డీల్ ప్రకారం మొత్

Webdunia
బుధవారం, 23 మే 2018 (11:43 IST)
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ముఖ్యంగా, ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఇరు పార్టీల మధ్య మంత్రిపదవుల పంపిణీపై డీల్ కుదిరింది. ఈ డీల్ ప్రకారం మొత్తం 34 మంత్రిదవుల్లో కాంగ్రెస్‌కు 22, జేడీఎస్‌కు 12 చొప్పున ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించాయి. అలాగే, ముఖ్యమంత్రిగా కుమార స్వామి, ఉప ముఖ్యమంత్రిగా పరమేశ్వరలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
 
అలాగే, ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌కు స్పీకర్, జేడీఎస్‌కు డిప్యూటీ స్పీకర్‌ పదవులు దక్కాయి. స్పీకర్‌గా కాంగ్రెస్‌ నేత కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ను ఈ నెల 25న ఎన్నుకోనున్నారు. బల నిరూపణ తర్వాతే మంత్రి పదవుల అంశంలో శాఖల కేటాయింపుల ప్రక్రియ ఉంటుందని కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. కాగా, కుమారస్వామి ఈ నెల 24న బలపరీక్ష ఎదుర్కోనున్నారు. 
 
మరోవైపు, ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ అతిరథలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆ పార్టీ సీనియర్ నేతలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు... ఇతర పార్టీల నేతలు హాజరుకానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments