Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబర్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 13 నవంబరు 2019 (14:16 IST)
బెంగళూరు నగర వీధుల్లో రక్తపు మరకలతో కూడిన దుస్తులను ధరించి.. ప్రజలను భయాందోళనలకు గురిచేసిన ఏడుగురు యూట్యూబర్లను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పాపులర్ కావాలనుకున్న ఏడుగురు యూట్యూబర్లు తెలుపు వస్త్రాలను ధరించి.. రక్తపు మరకల్లాంటి రంగులను ఆ దుస్తులపై చల్లుకున్నారు. 
 
అలాగే చూసిన వారు భయపడే రీతిలో మేకప్ వేసుకున్నారు. ఇలా ప్రజలను భయపెట్టి ఆ దృశ్యాలను వీడియో రూపంలో సోషల్ మీడియాలో ముందున్న యూట్యూబ్‌లో పోస్టు చేయాలనుకున్నారు. కానీ సీన్ రివర్సైంది. పోలీసులు ఆ ఏడుగురిని అరెస్ట్ చేశారు. 
 
అయితే ఆ ఏడుగురు యూట్యూబర్లు ఆ మేకప్‌తో ఆటో డ్రైవర్‌ను భయపెట్టారు. అక్కడ నుంచి తప్పించుకున్న ఆటో డ్రైవర్.. యశ్వంత్ పూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆపై రంగంలోకి దిగిన పోలీసులు యూట్యూబర్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 
 
అరెస్టయిన ఏడుగురు యువకులను షాన్ మాలిక్, నావిద్, షాజిల్ మొహ్మద్, మొహ్మద్ అక్యూబ్, షాకిబ్, సయ్యద్, యూసుఫ్ అహ్మద్‌గా గుర్తించారు. వీరందరూ 20-25 సంవత్సరాల్లోపు వారేనని పోలీసులు వెల్లడించారు. ఇంకా వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ ఏడుగురు బెయిల్‌పై విడుదలయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments