Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ కొత్త పెళ్లి జంటకు ఏకే-47 గిఫ్ట్.. వీడియో వైరల్

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (14:06 IST)
పాకిస్థాన్‌లో ఓ పెళ్లి జంట ఏకే-47ను బహుమతిగా పొందింది. పాకిస్థాన్‌కి చెందిన ఒక జంట మాత్రం వెరైటీ బహుమతిని అందుకున్నారు. ఆ జంటకు ఒక మహిళ ఎకె47 రైఫిల్ బహుమతిగా ఇచ్చింది. ఆ బహుమతి చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు.

కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో వైరల్‌గా మారింది. 30 సెకన్ల వ్యవధి గల ఈ వీడియోలో సదరు మహిళ వరుడికి ఏకే-47 రైఫిల్‌ను బహుమతిగా ఇవ్వడాన్ని చూడవచ్చు. అయితే, వరుడు మాత్రం ఏకే-47 బహుమతిని చూసి ఏ మాత్రం ఆశ్చర్యపోకుండా ముఖం మీద చిరునవ్వుతో దాన్ని అందుకోవడం గమనార్హం. 
 
కాగా, ఈ వీడియోను ''వివాహ బహుమతిగా కలాష్నికోవ్ రైఫిల్" అనే ట్యాగ్ లైన్‌తో ట్విట్టర్లో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోని పరిశీలిస్తే వివాహం పాకిస్థాన్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ట్విట్టర్‌లో వైరల్ అయిన ఈ పోస్టును ఇప్పటివరకు 1.88 లక్షల మందికి పైగా చూడగా... 2.5 వేల మంది లైక్స్ ఇచ్చారు. వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments