Webdunia - Bharat's app for daily news and videos

Install App

జస్ట్ రెండు నెలలు ఆగండి, సంచలన వార్త వింటారు: బాంబు లాంటి వార్త పేల్చిన కేసీఆర్

Webdunia
గురువారం, 26 మే 2022 (20:34 IST)
కేసీఆర్. సంచలనాలకు మారుపేరు. ప్రస్తుతం కేంద్రంతో ఢీకొడుతూ దేశవ్యాప్తంగా భాజపా వ్యతిరేక కూటమి పార్టీలతో సమావేశమవుతున్నారు. గురువారం బెంగళూరులో మాజీప్రధాని దేవెగౌడను కలిశారు.


ఈ సందర్భంగా ఆయన... రెండు నెలలు ఆగండి, సంచలన వార్త వింటారు, రాజకీయాల్లో పెనుమార్పు చోటుచేసుకోబోతోందంటూ బాంబు లాంటి వార్త చెప్పారు. ఇంతకీ ఆ మార్పు ఏమిటి... రెండు నెలల్లో అంతటి సంచలనమైనది ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది.

 
దేవెగౌడతో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ... స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని ఎందరో ప్రధానులు పరిపాలించారు. దేశ పరిస్థితి మాత్రం బాగుపడలేదు. మనకంటే ఎంతో వెనకబడి వున్న చైనా అభివృద్ధిలోనూ, ఆర్థికంగా దూసుకుపోతోంది. మనం మాత్రం ఎంతో వెనకబడి వున్నాం.

 
ఈ పరిస్థితి మారాలంటే మార్పు రావాల్సిందే. ఆ మార్పును ప్రజలు కోరుకుంటున్నారు. భారతదేశం ఉజ్వల భవిష్యత్ కోసం కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. మరోవైపు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా కేసీఆర్ పైన విరుచుకపడ్డారు.


తెలంగాణ వచ్చాక ప్రయోజనం పొందింది ఒక్క కుటుంబమేననీ, ప్రజలకు ఏమీ రాలేదన్నారు. కేవలం ఆ కుటుంబం మాత్రమే దోచుకుంటోందని దుయ్యబట్టారు. కుటుంబ పాలన అంతమైతేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అన్నారు.

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments