Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోకి ఐఎస్ఐ ఏజెంట్లు.. దేశ వ్యాప్తంగా హైఅలెర్ట్

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (11:09 IST)
భారత్‌లోకి ఐఎస్ఐ ఏజెంట్లు చొరబడ్డారని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దేశ వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించాయి. దేశంలో విధ్వంసం సృష్టించే అవకాశాలు ఉన్నాయని అందువల్ల అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. 
 
ఈ ఇద్దరు ఏజెంట్లూ ఆప్ఘనిస్థాన్ పాస్ పోర్టుపై రాజస్థాన్-గుజరాత్ రాష్ట్రాల సరిహద్దుల మీదుగా దేశంలోకి చొరబడినట్టు నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వానికి సమాచారం అందింది. దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
దీంతో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దులతోపాటు ఇతర ప్రాంతాల్లోని హోటళ్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాజస్థాన్‌లోని సిరోహి జిల్లా ఎస్పీ కల్యాణ్ మల్ మీనా అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. 
 
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలని, అటువంటి వారిపై నిఘా పెట్టాలని సూచించారు. అలాగే, దేశంలోని ముఖ్య నగరాల్లో కూడా భద్రతను అప్రమత్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments