అబ్బాయ్.. తితిదే చైర్మన్ పోస్ట్ మరో ఏడాది కావాలి, కుదరదులే బాబాయ్ అన్న జగన్?!!

Webdunia
గురువారం, 1 జులై 2021 (17:00 IST)
అబ్బాయి నాకు ఇచ్చిన పదవీకాలం ముగిసిపోతోంది. మరో సంవత్సరం పొడిగించు అంటూ సాక్షాత్తు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వై.వి.సుబ్బారెడ్డి ప్రాధేయపడ్డట్లు సమాచారం. రెండు సంవత్సరాల కాలపరిమితి ముగిసింది. ఎక్కడ కూడా ఎలాంటి ఆరోపణలు రాలేదు. కాబట్టి నాకు అవకాశం కావాలని తాడేపల్లికి వెళ్ళి అడిగారట.
 
అయితే అదంతా పట్టించుకోని సిఎం టిటిడికి స్పెసిఫైడ్ అథారిటీని నియమించారు. పాలకమండలిని రద్దు చేసేశారు. దీంతో అలకపాన్పు ఎక్కిన వై.వి.సుబ్బారెడ్డి బెంగుళూరు నగరానికి వెళ్ళిపోయారట. బెంగుళూరులో జగన్ ఇంటికి సమీపంలోనే వై.వి.సుబ్బారెడ్డికి ఇల్లు ఉంది.
 
దీంతో ఆయన అక్కడకు వెళ్ళిపోయారట. ఎవరితోను మాట్లాడడం లేదట. తనను బుజ్జగించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే సున్నితంగా తిరస్కరిస్తున్నారట వై.వి.సుబ్బారెడ్డి. విషయం కాస్త జగన్ దృష్టికి వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే పదవిని కొంతమందికి కొన్నిరోజులే ఉంటుందని ఇప్పటికే సిఎం ప్రకటించారు. అందులో భాగంగానే సొంతవారైనా, ఎవరైనా సరే ఇలాగే ఉంటుందని చెప్పడానికి జగన్ ఇలా చేశారంటూ వైసిపిలో ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments