Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీపై ప్రశంసలు - ఇళయరాజాకు రాజ్యసభ సీటు?

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (09:24 IST)
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెహ్ అంబేద్కర్‌పై ప్రశంసల వర్షం కురిపించిన సంగీత మేథావి ఇళయరాజాకు రాజ్యసభ సీటు వరించనుంది. రాష్ట్రపతి కోటాలో ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 
 
బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి పదవీకాలం త్వరలో ముగియనుంది. ఆయన స్థానంలో ఇళయరాజాను రాష్ట్రపతి కోటా కింద నామినేట్ చేయాలని బీజేపీ పెద్దలు దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోడీని డాక్టర్ అంబేద్కర్‌తో పోల్చడమే. 
 
ఇటీవల "అంబేద్కర్ అండ్ మోడీ - ఫీర్మ్స్ ఐడియాస్, ఫెర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్" అనే పుస్తకానికి ఇళయరాజా ముందుమాట రాశారు. ఇందులో అంబేద్కర్ ఆశయాలను ప్రధాని మోడీ నెరవేర్చుతున్నారంటూ వ్యాఖ్యానించారు. పైగా, అంబేద్కర్ జీవించివుంటే ప్రధాని మోడీని చూసి గర్వపడేవారంటూ కితాబిచ్చారు. 
 
ఈ వ్యాఖ్యలు ఓ వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. తమిళనాడులోని బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఇళయరాజాపై దుమ్మెత్తి పోశాయి. బీజేపీ శ్రేణులకు మాత్రం మరింత ఉత్తేజాన్ని కల్పించాయి. ఈ నేపథ్యంలోనే ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments