హాట్ కేకుల్లా స్పెషల్ ట్రైన్ టిక్కెట్లు.. జస్ట్ 20 నిమిషాల్లో ఖాళీ

Webdunia
మంగళవారం, 12 మే 2020 (09:37 IST)
కరోనా లాక్డౌన్ సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాన న్యూఢిల్లీ నుంచి దేశంలోని 15 ముఖ్య నగరాలకు ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఈ రైళ్లలో ప్రయాణం చేసేందుకు కేవలం ఆన్‌లైన్‌లోనే రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించి, సోమవారం మధ్యాహ్నం నుంచి ఆన్‌లైన్ రిజర్వేషన్‌ను ప్రారంభించింది. అలా ఆన్‌లైన్ రిజర్వేషన్ కౌంటర్ ప్రారంభమైందో లేదో.. టిక్కెట్లు మాత్రం క్షణాల్లో అమ్ముడుపోయాయి. అంటే.. కేవలం 20 నిమిషాల్లో ఈ టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి. 
 
మంగళవారం నుంచి దేశంలోని ఎంపిక చేసిన మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడువనున్నాయి. ఈ రైళ్ళలో ప్రయాణం చేసేందుకే ఆన్‌లైన్ రిజర్వేషన్ కల్పించారు. నిజానికి సోమవారం సాయంత్రం నాలుగు గంటలకే విక్రయాలు ప్రారంభంకావాల్సి ఉన్నా సాంకేతిక సమస్యల కారణంగా ఆరు గంటలకు మొదలయ్యాయి.
 
ఈ ప్రత్యేక రైళ్ళలో ఒకటి అయిన హౌరా - ఢిల్లీ మధ్య నడిచే రైలులోని ఏసీ-1, ఏసీ-3 టికెట్లు కేవలం 10 నిమిషాల్లోనే అమ్ముడుపోగా, మిగిలిన అన్ని టికెట్లు 20 నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోయాయి. భువనేశ్వర్ - ఢిల్లీ రైలులోని ఏసీ-1, ఏసీ-3 టికెట్లు అరగంటలోనే అమ్ముడయ్యాయి.
 
తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వివరాలు... 
కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా సుమారు గత 50 రోజులుగా పరుగులు తీయని రైళ్లు... మంగళవారం నుంచి మళ్లీ పట్టాలపై తిరగనున్నాయి. ఇందుకోసం కేంద్రం పచ్చజెండా ఊపింది. అయితే, పలు ఆంక్షల మధ్య ఈ రైళ్లను నడుపుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న మూడో దశ లాక్డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. ఇది పూర్తిగా ముగియకముందే... రైళ్ల రాకపోకలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. 
 
దీంతో 12వ తేదీ నుంచి 15 జతల రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ రైళ్లు దేశంలోని ముఖ్య నగరాల మధ్య తిరుగుతాయి. ఈ రైళ్ళలో ప్రయాణం చేయదలచిన వారు విధిగా రిజర్వేషన్ చేసుకోవాల్సివుంటుంది. టిక్కెట్ కౌంటర్ల వద్ద ప్రయాణ టిక్కెట్లను విక్రయించరు. అలాగే, ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాతనే రైళ్లలోకి అనుమతిస్తామని, ప్రతి ఒక్కరూ మాస్క్ లను ధరించాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది. 
 
12వ తేదీ నుంచి పరుగులు తీయనున్న రైళ్ల వివరాలను పరిశీలిస్తే, హౌరా - న్యూఢిల్లీ, రాజేంద్రనగర్ - న్యూఢిల్లీ, డిబ్రూగఢ్ - న్యూఢిల్లీ, న్యూఢిల్లీ - జమ్మూతావి, బెంగళూరు - న్యూఢిల్లీ, తిరువనంతపురం - న్యూఢిల్లీ, చెన్నై సెంట్రల్ - న్యూఢిల్లీ, బిలాస్ పూర్ - న్యూఢిల్లీ, రాంచీ - న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్ - న్యూఢిల్లీ, అహ్మదాబాద్ - న్యూఢిల్లీ, అగర్తలా - న్యూఢిల్లీ, భువనేశ్వర్ - న్యూఢిల్లీ, మడ్‌గావ్ - న్యూఢిల్లీ, సికింద్రాబాద్ - న్యూఢిల్లీల మధ్య రైళ్లు తిరుగుతాయి.
 
అయితే, రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ళ వివరాలను పరిశీలిస్తే, 
* బెంగళూరు, న్యూఢిల్లీ మధ్య రోజూ తిరిగే రైలు శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, రాయచూరు సికింద్రాబాద్, కాజీపేటల మీదుగా ప్రయాణిస్తుంది. బెంగళూరులో రాత్రి 8 గంటలకు, న్యూఢిల్లీలో రాత్రి 8.45 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది. 
 
* న్యూఢిల్లీ, చెన్నై సెంట్రల్ మధ్య శుక్ర, ఆదివారాల్లో, తిరుగు ప్రయాణంలో బుధ, శుక్ర వారాల్లో నడిచే రైలు, విజయవాడ, వరంగల్ నగరాల మీదుగా ప్రయాణిస్తుంది. న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3.55 గంటలకు, చెన్నై సెంట్రల్‌లో ఉదయం 6.05 గంటలకు రైళ్లు బయలుదేరుతాయి. 
 
* సికింద్రాబాద్, న్యూఢిల్లీ మధ్య బుధవారం, తిరుగు ప్రయాణంలో ఆదివారం బయలుదేరే రైలు కాజీపేట మీదుగా సాగుతుంది. సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12.45 గంటలకు, న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3.55 గంటలకు రైళ్లు బయలుదేరుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments