Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా మోసం చేస్తే ఉద్యోగం నుంచి పీకేస్తాం: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ వార్నింగ్

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (16:19 IST)
ఉద్యోగం చేస్తూనే ఇతర కంపెనీల్లో పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారి సంఖ్య ఎక్కువయిపోతోందని పలు కంపెనీలు తమ ఉద్యోగుల వైఖరిపై బహిరంగంగానే విమర్శలు గుపిస్తున్నాయి. తాజాగా ఇండిటన్ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

 
కంపెనీలో ఫుల్ టైం ఉద్యోగులుగా కొనసాగుతూ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసేవారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. కంపెనీ నియమావళి ప్రకారం ఇది విరుద్ధమనీ, ఇలా ఒకే సమయంలో రెండు ఉద్యోగాలను చేసేవారిని ఉపేక్షించేది లేదని, ఇలాంటివారిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తామంటూ ఇ-మెయిల్స్ పంపింది.

 
ఉద్యోగం చేస్తూనే పార్ట్ టైమ్ జాబ్ చేసేవారి వల్ల కంపెనీకి నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. ఇలాంటి వారి వల్ల పనితీరులో నాణ్యతలోపం, రహస్య సమాచారం లీకేజీ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపింది. ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు ఇలాంటి ఇ-మెయిల్స్ ఇవ్వడంతో అది కాస్తా ఇప్పుడు ట్రెండింగ్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments