Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే నెలలో 75 వేలకు చేరుకోనున్న కరోనా కేసులు??

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (20:35 IST)
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలుచేస్తోంది. అయినప్పటికీ కేసుల తగ్గుదల కనిపించకపోగా నానాటికీ పెరిగిపోతోంది. ఫలితంగా ఇప్పటికే 21 వేల మార్కుకు తాకాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే మే నెల రెండో వారానికి ఈ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75 వేలకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ వైరస్ వ్యాప్తి మే నెలలో ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా, ఇటలీ, అమెరికా దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కేంద్ర ఆరోగ్య శాఖ, నిపుణులు అంచనా వేసి ఈ సంక్షోభాన్ని నివారించేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 
 
ఇటలీ, అమెరికా దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని ఏ విధంగా అడ్డుకున్నారో నిశితంగా విశ్లేషించి ఇదే విధానాన్ని కూడా భారత్‌లో అమలు చేయొచ్చని ఆ నివేదిక పేర్కొంది. పైగా, లాక్‌డౌన్ ఎత్తివేసే అంశంలో కూడా అన్ని పరిస్థితులను విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. 
 
అంతేకాకుండా, ప్రస్తుతం మే మూడో తేదీ వరకు కొనసాగనున్న లాక్‌డౌన్‌ను మే నెలాఖరు వరకు పొడగించాలనే వాదనలు మీడియాలో వినిపిస్తున్నాయి. అలా చేస్తేనే జూన్ నెల మధ్యంతరానికి కరోనా కేసుల సంఖ్య సున్నాకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments