Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తొలిసారి పట్టాలెక్కిన ప్రైవేట్ రైలు

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (12:54 IST)
దేశంలో తొలిసారి ప్రైవేట్ రైలు పట్టాలెక్కింది. భారత్ గౌరవ్ పేరుతో ఈ రైలును నడుపుతున్నారు. కోయంబత్తూరు నుంచి షిర్డీకి ఈ నెల 14వ తేదీన బయలుదేరి వెళ్లింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఈ రైలు కోవై స్టేషన్ నుంచి మహారాష్ట్రలోని షిర్డీకి బయలుదేరి వెళ్లింది. ఇది తన గమ్యస్థానానికి గురువారం ఉదయం 7.25 గంటలకు చేరుకుంటుంది. దీంతో దేశంలో తొలి ప్రైవేటు రైలు సర్వీసును ప్రారంభించిన ఘనత చెన్నై కేంద్రంగా ఉన్న దక్షిణ రైల్వేకు దక్కింది. 
 
మొత్తం 20 బోగీలు కలిగిన ఈ రైలులో 1500 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంది. ఇందులో ఏసీ కోచ్‌లతో పాటు స్లీపర్ కోచ్‌లు కూడా ఉన్నాయి. ఈ రైలును నిర్వాహకులు రెండేళ్ల కాలపరిమితికి లీజుకు తీసుకున్నారు. నెలలో కనీసం మూడు ట్రిప్పులుగా ఈ రైలును నడిపేలా ప్లాన్ చేశారు. కోయంబత్తూరుకు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ ఈ రైలును నడుపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments