Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తొలి మంకీపాక్స్ మృతి కేసు నమోదు

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (08:53 IST)
దేశంలో తొలిసారి మంకీపాక్స్ మృతి కేసు నమోదైంది. యూఏఈలో ఉండగానే, మంకీపాక్స్ సోకిన యువకుడు అధికారులకు చెప్పలేదు. కేరళకు వచ్చాక ఆయనకు తీవ్ర జ్వరం, తలనొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరాడు. అక్కడ జరిపిన వైద్య పరీక్షల్లో అతనికి మంకీపాక్స్ సోకినట్టు తేలింది. పైగా, చర్మంపై పుండ్లు, దద్దుర్లు వంటివి లక్షణాలు లేకపోవడంతో సాధారణ చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, ఆ యువకుడు మృతి చెందాడు. ఇది భారత్‌‌లో నమోదైన తొలి మంకీపాక్స్ కేసుగా నమోదైంది. 
 
ఈ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతుని వయసు 22 యేళ్లు. అయితే, ఈ విషయం ఆలస్యంగా తెలిసిందని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు అతడి నమూనాలను పరీక్షల కోసం పంపామని, మృతి కారణాలను విశ్లేషిస్తున్నామని తెలిపారు. ఇది మంకీపాక్స్ కారక మరణమేనని కేరళ ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ దేశంలో తొలి మంకీపాక్స్ మృతిగా పేర్కొంటున్నారు. 
 
మరోవైపు, ఈ మృతిపై కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ స్పందించారు. శనివారం మరణించిన యువకుడిలో మంకీపాక్స్ లక్షణాలు ఏవీ కనిపించలేదని ఆ యువకుడి మృతికి కారణాలను విశ్లేషిస్తున్నామని తెలిపారు. కోవిడ్ తరహాలో మంకీపాక్స్ ప్రాణాంతకం కాదని ఆమె తెలిపారు. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్నప్పటికీ మరణాలు రేటు మాత్రం చాలా తక్కువగా ఉందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments