ఐస్ క్రీమ్ స్టిక్‌లపై ఇడ్లీలు.. చట్నీ, సాంబార్.. ఆనంద్ మహీంద్రా ట్వీట్

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (14:39 IST)
Idly ice cream
ఇడ్లీలంటే భారత దేశ ప్రజలకు మహా ప్రీతి. ఇడ్లీలలో వుండే పోషకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఇడ్లీల చిత్రాన్ని ట్వీట్ చేశారు. ఈ ఇడ్లీలలోనే ప్రత్యేకత వుంది. ఈ ఇడ్లీలను ఐస్ క్రీమ్ స్టిక్‌లపై వడ్డించారు. అంతే ఫోటో వైరల్ అయ్యింది. 
 
బెంగుళూరుకు చెందిన వ్యక్తి ఈ వంటకాన్ని పరిచయం చేశారు. ఐస్ క్రీమ్ స్టిక్‌పై ఇడ్లీ -సాంబార్ మరియు చట్నీ డిప్‌లు గల ఫోటోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ 15,000 లైక్‌లను సంపాదించింది. ఇంకా 1,400 సార్లు రీట్వీట్ చేయబడింది. ఐస్‌క్రీమ్ స్టిక్‌లపై ఇడ్లీలను అందించాలనే వినూత్న ఆలోచనను చూసి చాలా మంది వినియోగదారులు ఆశ్చర్యపోయారు, మరికొందరు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
 
"పూర్తిగా వ్యతిరేకం ... ఒంటి చేత్తో ఇడ్లీ తినడం నిజమైన సంప్రదాయం ... ఇది అనారోగ్యం" అని ఒక వినియోగదారు రాశారు. "భారతీయ ఆహారాన్ని చేతులతో మాత్రమే తింటే మంచిది. మరేదైనా నేరమే" అని మరొకరు పంచుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Sirish: దుబాయ్‌లో శిరీష్ ప్రీ-వెడ్డింగ్ షూట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Mahesh Babu: రాజమౌళికి ఓకే అనిపించడం అంత ఈజీ కాదు : మహేష్ బాబు

ఆనంద్ దేవరకొండ చీకటి లోకంలో దేనికోసం నీ వెతుకులాటా?

Sharwanand: బైకర్ ఇంజన్ సిద్దమైంది. రేపు గ్లింప్స్ రాబోతోంది

Raviteja: సుమతీ శతకం ట్రైలర్ బాగా నచ్చింది, చిత్రం విజయవంత కావాలి: రవితేజ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

తర్వాతి కథనం
Show comments