పాలేరు నుంచి బరిలోకి దిగుతా, వైఎస్ షర్మిల కీలక ప్రకటన

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (16:22 IST)
తెలంగాణలో పార్టీ ఏర్పాటు వైపు అడుగులు వేస్తున్న వైఎస్ షర్మిల.. ఇప్పటికే వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక, వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. వారి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు.. తెలంగాణ సర్కార్ వైఫల్యాలు కూడా ఎత్తి చూపడం మొదలు పెట్టారు.
 
ఇక, ఇవాళ  ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించిన షర్మిల.. తాను పోటీ చేసే స్థానం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. నేను పాలేరు నుంచి బరిలోకి దిగుతానన్న ఆమె వైఎస్సార్‌కి పులివెందుల ఎలాగో.. నాకు పాలేరు అలాగే. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మన ప్రభంజనాన్ని ఆపలేరని ఖమ్మం నేతలతో చెప్పినట్లు సమాచారం.
 
ఇక గతంలో ఆమె తన కొత్త పార్టీ ప్రకటన పై క్లారిటీ ఇచ్చారు.. ఏప్రిల్‌ 9వ తేదీన పార్టీ ప్రకటన ఉంటుందని... లక్ష మంది సమక్షంలో పార్టీ ఏర్పాటు ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. ఇక తాను ఎవరో వదిలిన బాణాన్ని కానని వ్యాఖ్యానించిన ఆమె.. తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యంగా పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ ప్రకటన, పోటీ స్థానం మీద కూడా క్లారిటీ రావడంతో.. జెండా, ఎజెండా.. ఇతర అంశాలపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments