గెలుపు దిశగా ఈటెల రాజేందర్, 18 రౌండ్లకి భాజపా ఆధిక్యం 16,494

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (17:44 IST)
హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించే దిశలో వెళుతున్నారు తెలంగాణ మాజీమంత్రి ఈటెల రాజేందర్. హుజురాబాద్ ఉప ఎన్నికలో తొలుత భాజపా-తెరాస మధ్య హోరాహోరీ కనిపించింది కానీ మధ్యాహ్నం తర్వాత ఈటెల రాజేందర్ ఆధిక్యం రౌండు రౌండుకీ పెరుగుతూ వెళుతోంది. ఇక మరో నాలుగు రౌండ్లు మాత్రమే మిగిలి వున్నాయి.

 
మొత్తం 18 రౌండ్లలో కేవలం 8, 11వ రౌండ్లలో మాత్రమే తెరాస అభ్యర్థి ఆధిక్యం కనబరిచాడు. మిగిలిన రౌండ్లన్నింటిలోనూ ఈటెల రాజేందర్ ఆధిక్యం కనబరిచారు. మరోవైపు ఈటెల ఆధిక్యంలో దూసుకుపోతూ వుండటంతో భాజపా కార్యాలయం వద్ద సంబరాలు చేసుకుంటున్నారు.

 
ఇకపోతే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అధఃపాతాళానికి పడిపోయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితిలో వుండగా తెలంగాణలోనూ అదే స్థితి కనబడుతోంది. హుజురాబాద్ ఎన్నికలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 15 రౌండ్లు ముగిసే సమయానికి కేవలం 2వేల ఓట్లు మాత్రమే వచ్చాయంటే... ఇక ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments