Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ కేసులో కీలక పరిణామం... ఇక నిందితులు రోజులు లెక్కించుకోవాల్సిందే...

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (18:32 IST)
హైదరాబాద్ నగరంలో పశువైద్యురాలు దిశ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టు అయిన నలుగురు నిందితులకు సత్వరం శిక్ష పడాలని డిమాండ్లు వెల్లువెత్తున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఇందులోభాగంగా, ఈ కేసు విచారమ నిమిత్తం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటును ఏర్పాటు చేయాల్సిందిగా హైకోర్టులో ప్రభుత్వం తరపున పిటిషన్ దాఖలు కావడం, దానికి కోర్టు అనుమతించడం చకచకా జరిగిపోయింది. 
 
హైకోర్టు స్పందన నేపథ్యంలో రాష్ట్ర న్యాయశాఖ దీనిపై కసరత్తు చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టును మహబూబ్ నగర్‌లో ఉర్పాటు చేసేందుకు కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు నేపథ్యంలో, ఈ కేసు విచారణ త్వరితగతిన సాగనుంది. రోజువారీ విచారణ జరిపి, నిందితులకు త్వరగా శిక్షపడేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇటీవల వరంగల్‌లో ఓ బాలిక హత్య ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయగా... కేవలం 56 రోజుల్లోనే విచారణ పూర్తై, తీర్పు వెలువడిన విషయం తెల్సిందే. వీరికి శిక్షను అమలు చేయాల్సివుంది. 
 
ఇదిలావుంటే, దిశ హత్య కేసులోని నిందితుల వద్ద విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నలుగురు నిందితులను వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సమ్మతించింది. దీంతో ఈ నలుగురు నిందితులను పోలీసులు వారం రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. మరోవైపు, ఈ నలుగురు నిందితులను మంగళవారం కోర్టులో హాజరుపరచగా, వారిపై స్థానికులు చెప్పులు విసిరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments