దేశంలో జైషే ఉగ్రవాదులు.. బృందాలుగా విడిపోయి విధ్వంసానికి ప్లాన్

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (15:51 IST)
పాకిస్థాన్ ప్రేరేపిత జేషే మహ్మద్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారు. వీరంతా చిన్నచిన్న బృందాలుగా విడిపోయి దేశంలో విధ్వంసానికి ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దేశ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణ రద్దుతో పాకిస్థాన్‌, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు రగలిపోతున్నారు. భారత్‌తో ప్రతీకారానికి రగిలిపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో సరిహద్దు వెంబడి దాదాపు 500 మంది ఉగ్రవాదులు పొంచి ఉన్నారని ఇటీవలే ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కూడా హెచ్చరించారు. ఇపుడు ఇంటెలిజెన్స్ బ్యూరో తాజా హెచ్చరికలు చేసింది. పాకిస్థాన్ వైపు నుంచి జైషే మహ్మద్ ఉగ్రవాదులు చిన్న బృందాలుగా విడిపోయి భారత్‌లో చొరబడ్డారని, వారిలో నలుగురితో కూడిన ఓ టీమ్ దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టిందన్నది నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారం.
 
జైషే మహ్మద్ ఉగ్రవాదులు వరుస దాడులకు పాల్పడాలన్న లక్ష్యంతో భారత్‌లో ప్రవేశించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఆత్మాహుతి దాడులకు దిగే అవకాశాలున్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో సాయుధ బలగాలను మోహరించారు. అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తులను నిశితంగా సోదాలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran: ఇకపై మీరు గర్వపడేలా మూవీస్ చేస్తాను : కిరణ్ అబ్బవరం

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments