ఒక్క విమానంలో 640 మంది.. ఫొటో వైరల్‌

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (15:13 IST)
600 Afghans
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో.. అక్కడి ప్రజలు ప్రాణ భయంతో కాబూల్‌ విమానాశ్రయానికి పరుగులు తీశారు. తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు అక్కడ కనిపించిన ప్రతి విమానంలోకి ఎక్కారు. విమానాలు కాస్తా.. బస్సుల్ని తలపించాయి. 
 
ఆఖరికి విమానం రన్‌వేపై ల్యాండవుతుండగానే వందలాది మంది విమానంలోకి ఎక్కారు. వెళ్లలేనివాళ్లు.. విమానం టైర్లను పట్టుకొని కూర్చున్నారు. అలా విమానం పైకి ఎగరగానే ముగ్గురు కిందపడి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ విచారకర సంఘటన జరిగిన ఆ విమానంలో ఎంతమంది ఎక్కారో తెలుసా..?! ఏకంగా ఆ విమానంలో 640 మంది ఆఫ్ఘన్లు ఎక్కారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సి-17 కార్గో విమానం. విమానంలో కిక్కిరిసి కూర్చున్న జనం ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. 
 
దీనిపై అమెరికా రక్షణ అధికారులు మాట్లాడుతూ.. 'అంతమందిని తీసుకెళ్లే ఉద్దేశం మాకు లేదు. అయినా ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న భయానక పరిస్థితుల నేపథ్యంలో విమానంలోకి ఎక్కిన ఎవరినీ కిందకు దించలేదు. ఆ 640 మందిని ఖాతార్‌లో సురక్షితంగా దించాము' అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments