Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 ఏళ్ళుగా అన్నం తిన‌లేదు, ఈ దిగంబర అఘోరా స్వామీజీ

Webdunia
గురువారం, 15 జులై 2021 (18:17 IST)
ఈ దిగంబ‌ర అఘోరా స్వామీజీ 21 ఏళ్ళుగా అన్నం తిన‌డం లేదు...కేవ‌లం పండ్లు, పాలు త‌ప్ప ఏదీ తీసుకోలేదు. అలాంటి స్వామీజీ కృష్ణా జిల్లా నందిగామ‌కు చేర‌డంతో అంద‌రూ ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.
 
ఒరిస్సా లోని పూరీ జగన్నాథ్ స్వామి రధయాత్రలో పాల్గొని ఈ అఘోరా నందిగామకు వ‌చ్చారు. హైదరాబాద్ మహారాష్ట్ర మీదుగా, ఉత్తరాఖండ్ లోని కణ్‌కల్ హరిద్వార్ ద‌ర్శించి ఆయ‌న ఇక్క‌డ‌కు చేరారు. మాయాదేవీ మఠానికి చెందిన బఛ్ఛాగిరి మహరాజ్ దిగంబర అఘోరా స్వామీజీగా ఆయ‌న్ని పిలుస్తారు. ఆ స్వామికి నందిగామ ఆర్యవైశ్య సంఘం నాయకులు స్వాగతం పలికారు. 
 
ఈ సందర్భంగా నందిగామ పాత బస్టాండ్ వద్ద గల ఒక ప్రైవేటు భవనంలో కొద్దిసేపు భక్తులకు ఆధ్యాత్మిక విషయాలు వివరించారు. అఘోరా స్వామి గత 21 సంవత్సరాలుగా ఎటువంటి ఆహారం తీసుకోవటం లేదని, కేవలం పండ్లు, పాలు మాత్రమే భుజిస్తారని వారి శిష్యులు దేవానంద్ గిరి మహరాజ్, ధర్నగిరి మహరాజ్, గోవింద గిరి మహరాజ్‌లు తెలిపారు.

ఆర్య వైశ్య సంఘం నాయకులు పారేపల్లి సాయిబాబు, 4వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ మారం అమరయ్య, ప్రముఖ ఆధ్యాత్మిక భక్తురాలు అనుమోలు దేవీ, పరిశె మల్లిఖార్జున రావు, నల్లమల్లి మురళి, పమిడిమర్రి ఆంజనేయులు తదితరులు అఘోరా స్వామిని సత్కరించారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments