Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంబర్తిలో మళ్లీ బంగారం బయటపడింది, మాకూ వాటా వుందంటూ పూర్వ యజమానులు

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (10:04 IST)
పెంబర్తిలో లంకెబిందె లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పురావస్తు శాఖ మళ్లీ అక్కడ తవ్వకాలు చేపట్టింది. ఈ తవ్వకాల్లో మరో 6.3 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.8 గ్రాముల వెండి గొలుసులు, 7.2 గ్రాముల పగడాలు లభ్యమయ్యాయి.
 
కాగా ఇప్పటివరకూ దొరికిన బంగారు ఆభరణాల్లో తమకూ వాటా ఇవ్వాలంటూ ఈ భూమిని విక్రయించిన మొదటి పట్టాదారులు ఆందోళనకు దిగారు. దీనితో రెవిన్యూ అధికారులు కలుగజేసుకుని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామని హామీ ఇచ్చారు. కాగా ఈ ఆభరణాలన్నీ ఓ కుటుంబానికి సంబంధించినవని స్థానికులు చర్చించుకుంటున్నారు.
 
జనగామ జిల్లా పెంబర్తిలో గురువారం నాడు ఓ లంకెబిందె వెలుగుచూసింది. హైదరాబాదు నగరానికి చెందిన నర్సింహ అనే వ్యక్తి పెంబర్తి పరిధిలో వున్న 11 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అందులో వెంచర్ వేసేందుకు భూమిని జెసిబితో చదును చేయిస్తున్నాడు. ఆ సమయంలో జెసిబికి లంకెబిందె తగిలింది.
 
 ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయగా వారు వచ్చి బిందెను తెరిచి చూడగా అందులో 5 కిలోల బంగారం, 2 కిలోల వెండి వున్నట్లు కనుగొన్నారు. కాగా తనకు గత కొన్నిరోజులుగా అమ్మవారు కలలోకి వస్తోందనీ, తన భూమిలో అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తానని యజమాని చెప్పాడు. కాగా లంకెబిందె బయటపడటంతో పురావస్తు శాఖ అధికారులు దీనిపై ఆరా తీస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం