Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి పడవ ప్రమాదం: బోటు డ్రైవర్లు బతికే ఉన్నారా?

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (18:41 IST)
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన పడవ ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చకు దారి తీసింది. 60కి పైగా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇప్పటికీ 16 మంది ఆచూకీ లభించలేదు. అయితే బోటు డ్రైవర్లు ఆచూకీ కూడా లభించలేదు.
 
బోటు డ్రైవర్లు నూకరాజు, సత్యనారాయణలు చనిపోలేదనీ, వారు బతికే ఉన్నారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ప్రమాదాన్ని ముందే ఈ బోటు డ్రైవర్లు గమనించారని తెలుస్తోంది. అందుకే బోటు ప్రమాదానికి పది నిమిషాల ముందే వీరు కిందకు దూకేశారని బోటులో ప్రయాణిస్తూ ప్రాణాలతో బయటపడిన వారు చెబుతున్నారు. 
 
పడవ నడపడంలోను, ఈత కొట్టడంలోను వీరిద్దరూ నిష్ణాతులు. అలాంటివారు చనిపోయే అవకాశాలు తక్కువని.. ఇంతటి పెద్ద ప్రమాదం జరగడానికి తామే కారణమని తెలిస్తే ఖచ్చితంగా పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో ఇద్దరు బోటు డ్రైవర్లు కనిపించకుండా తిరుగుతున్నారని తెలుస్తోంది. దీంతో పోలీసులు బోటు డ్రైవర్ల కుటుంబ సభ్యుల కాల్ డేటాను వెతికే పనిలో పడ్డారు. మరి నిజంగా ఈ డ్రైవర్లు బతికే వున్నారా లేదా అనేది కొన్నాళ్లు ఆగితే కానీ తెలియదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments