Webdunia - Bharat's app for daily news and videos

Install App

విండ్ షీల్డ్‌కు ఏర్పడిన పగుళ్లు... విమానం అత్యవసర ల్యాండింగ్

Webdunia
గురువారం, 21 జులై 2022 (10:21 IST)
దేశ రాజధాని ఢిల్లీ నుంచి గౌహతికి బయలుదేరిన ‘గో ఫస్ట్‌’ ఏ320 నియో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ విమానం విండ్‌షీల్డుకు (ముందు భాగం) పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని గుర్తించిన పైలెట్లు తక్షణం అప్రమత్తమై విమానాన్ని జైపుర్‌కు దారి మళ్లించారు. 
 
తొలుత ఈ విమానాన్ని ఢిల్లీకి వెనక్కి తీసుకెళ్లాలని భావించారు. కానీ, భారీవర్షం కురుస్తున్న కారణంగా సాధ్యపడలేదు. బుధవారం మధ్యాహ్నం తలెత్తిన ఈ సాంకేతిక లోపం ‘గో ఫస్ట్‌’ విమాన సర్వీసుల్లో గత రెండు రోజుల్లో మూడో ఘటనగా పౌరవిమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) అధికారులు తెలిపారు. 
 
ప్రయాణికులను జైపూర్‌ నుంచి మరో విమానంలో గౌహతికి పంపామని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఎదురవకుండా చూసినట్లు ‘గో ఫస్ట్‌’ అధికార ప్రతినిధి తెలిపారు. దేశంలోని వివిధ విమాన సర్వీసుల్లో గత నెల రోజుల్లో సాంకేతిక లోపాలకు సంబంధించిన ఘటనలు పెద్దసంఖ్యలో నమోదుకావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments