Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నా.. రావా..? నన్నొచ్చి తీసుకుపోవా..?

పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో వ్యభిచార దందా వెలుగు చూసింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అన్యపున్నెం ఎరుగుని బాలికలను వ్యభిచార రొంపిలోకి దించేందుకు వారికి గ్రోత్ హార్మోన్

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (15:39 IST)
పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో వ్యభిచార దందా వెలుగు చూసింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అన్యపున్నెం ఎరుగుని బాలికలను వ్యభిచార రొంపిలోకి దించేందుకు వారికి గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చారు. ఇలాంటి అకృత్యాలెన్నో వ్యభిచార నిర్వాహకులు చేశారు. చివరకు వారి పంటపండి.. వ్యభిచార గుహల్లో ఉన్న బాలికల్లో 15 మందికి పోలీసులు విముక్తి కల్పించారు.
 
యాదగిరిగుట్ట పట్టణంలోని వ్యభిచార గృహాలపై పోలీసుల వరుస దాడులతో వాటికి తాళాలువేసి నిర్వాహకులు పరారయ్యారు. సెక్స్‌ వర్కర్ల పడిగాపులు.. విటుల రాకపోకలతో సందడిగా ఉండే పట్టణంలోని గణేష్ నగర్‌ వంటి ప్రాంతాల్లో వేశ్యాగృహాలకు తాళాలతో నిర్మానుష్యంగా మారింది. పడుపు వృత్తి చేయించడం కోసం.. చిన్న పిల్లలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పెంచడమే వారికి గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చారు. 
 
మూడు రోజులుగా జరిపిన దాడుల్లో 15 మంది బాలికలకు విముక్తి కల్పించిన పోలీసులు 14 మంది వ్యభిచార గృహాల నిర్వాహకులను అరెస్టు చేశారు. వీరిపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమేకాకుండా పాత కేసులను క్రోడీకరించి పీడీ యాక్ట్‌ ప్రయోగించాలని రాచకొండ పోలీసులు నిర్ణయించారు. అదేవిధంగా అసాంఘీక కార్యకలాపాలు సాగుతున్న వేశ్యాగృహాలను సీఆర్‌పీ 133 ప్రకారం ఆర్డీవో ఉత్తర్వులమేరకు దాదాపు మూడేళ్లపాటు సీజ్‌ చేయించడానికి చర్యలు చేపడుతున్నారు. 
 
అంతేనా, ఐసీడీఎస్‌ జిల్లా అధికారి శారద ఆధ్వర్యంలో వ్యభిచార గృహాల్లోని పిల్లలకు విద్యాభ్యాసం కోసం ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థుల వివరాలను సేకరించారు. ఈ పాఠశాలలో దాదాపు 40 మంది విద్యార్థుల్లో 30 మంది వరకు బాలికలే ఉన్నారు. అయితే ఇదే పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 15 మంది బాలికలకు పోలీసులు విముక్తి కల్పించారు. 
 
వీరిలో అసలు విద్యార్థులు ఎవరో.. వ్యభిచార గృహాల్లో నివశించే బాలికలు ఎవరో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సంరక్షణా వసతి గృహంలో ఉన్న పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నాన్నా రావా.. నన్నొచ్చి తీసుకునిపోవా అంటూ ఎదురు చూస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం