Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబానీని క్రాస్ చేసిన ఆదానీ .. ఆసియా కుబేరుడుగా...??

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (18:54 IST)
ప్రస్తుతం ఆసియా కుబేరుడుగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ, ఇపుడు ఈయన్ను మరో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ క్రాస్ చేశారు. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం ఇప్పటివరకు ఆసియా కుబేరుడుగా ముఖేశ్ అంబానీ కొనసాగుతున్నారు. అయితే, ఇదే బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం గౌతం అదానీ సంపద 88.8 బిలియన్ డాలర్లు. ముఖేష్ అంబానీ సంపద 91 బిలియన్ డాలర్లు. ఇద్దరి మధ్య స్వల్ప తేడా మాత్రమే. 
 
అయితే, ఈ డేటా తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పతనమయ్యాయి. అదేసమయంలో అదానీ గ్రూప్ స్టాక్స్ పరుగులు పెట్టింది. ఆరామ్‌కో ఒప్పందం తర్వాత రిలయన్స్ షేర్లు రోజురోజుకూ క్షీణిస్తూ వస్తున్నాయి. రూ.2500 పైగా ఉన్న రిలయన్స్ స్టాక్ ఇపుడు రూ.2350గా వుంది. బుధవారం మరో 5.7 శాతం క్షీణించింది. అదానీ ఎంటర్‌ప్రైజస్ స్టాక్ 2.94 శాతం వృద్ధి కనిపించింది. 
 
ముఖ్యంగా, ఈ యేడాది జనవరి ఒకటో తేదీ నుంచి అదానీ సంపద 55 బిలియన్ డాలర్ల మేరకు పెరగా, అదేసమయంలో ముఖేశ్ అంబానీ సంపదలో వృద్ధిరేటు 14.3 బిలియన్ డాలర్లు మాత్రమే. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే ఆసియా కుబేరుడుగా గౌతమ్ అదానీ అవతరించారని పారిశ్రామిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత కూ సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments