Fun moments: ఏపీ కలెక్టర్ల సదస్సులో పేలిన చలోక్తులు.. నవ్వుకున్న పవన్ కల్యాణ్ (video)

సెల్వి
శుక్రవారం, 13 డిశెంబరు 2024 (13:35 IST)
Pawan kalyan
పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి కాకినాడ పోర్టులో 3 చెక్‌ పోస్టులు పెట్టిన తర్వాత కూడా బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే ఎవరిని నిందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. దీనికి అడ్డుకట్ట వేయడం కలెక్టర్, ఎస్పీల బాధ్యత కాదా అని నిలదీశారు. ఆ అధికారులు దీన్ని ఎలా విస్మరిస్తారన్నారు. విజిలెన్స్ శాఖ తన పని తాను సక్రమంగా నిర్వర్తిస్తే మంత్రి అక్కడి వెళ్లి అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎందుకొస్తుందన్నారు. 
 
ఈ నేపథ్యంలో అమరావతిలో జరుగుతున్న ఈ కలెక్టర్ల సదస్సులో ఇలాంటి సీరియస్ చర్చలు జరిగాయి. ఇంకా కొన్ని ఫన్నీ మూమెంట్స్ కూడా చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా కలెక్టర్లను ఉద్దేశించి ఏపీ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. 
RP Sisodia
 
తన శక్తుల్ని మరిచిపోయేలా హనుమంతునికి ఓ శాపం వుందని.. లంకకు వెళ్లాల్సిన సమయంలో సముద్రాన్ని దాటాల్సి వచ్చినప్పుడు జాంబవంతుడు గుర్తు చేస్తే తప్ప.. ఆ విషయాన్ని గుర్తుంచుకోలేదని రామాయణాన్ని ప్రస్తావించారు. కలెక్టర్ల అధికారాలను జాంబవంతుడిలా గుర్తు చేస్తున్నానని చలోక్తులు విసిరారు. 
 
కళ్లముందే అక్రమాలు జరుగుతున్నప్పటికీ సాక్షులుగా వుండిపోతున్నారే తప్ప చర్యలు తీసుకోవట్లేదని మొదటి రోజు డిప్యూటీ సీఎం పవన్ చేసిన కామెంట్లకు ఇది కొనసాగింపుగా తీసుకోవచ్చు. 
Pawan kalyan
 
ఈ ప్రస్తావన సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లతో పాటు అందరూ నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments