Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లు అరిచి గీపెట్టినా మేము చేయాల్సింది చేస్తాం...

పార్లమెంట్ వేదికగా టీడీపీ, వైకాపా ఎంపీలు అరిచి గీపెట్టినా తాము చేయాల్సింది చేసి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఆయన ఈ మాటలను తనను కలిసిన వైకాపాకు చెందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీతతో

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (18:07 IST)
పార్లమెంట్ వేదికగా టీడీపీ, వైకాపా ఎంపీలు అరిచి గీపెట్టినా తాము చేయాల్సింది చేసి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఆయన ఈ మాటలను తనను కలిసిన వైకాపాకు చెందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీతతో అన్నారు. అంతేకాకుండా, టీడీపీ, వైకాపాలు కేవలం రాజకీయ లబ్ధికోసమే ఇదంతా చేస్తున్నాయంటూ ఆయన మండిపడ్డారట.
 
పార్లమెంట్ భవనంలో ప్రధాని మోడీతో కొత్తపల్లి గీత కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 'ఆంధ్రప్రదేశ్‌కు మేం మేలు చేయాలనే ఉన్నాం. కానీ... టీడీపీ, వైసీపీ రాజకీయ లబ్ధి కోసం ఇదంతా చేస్తున్నాయి. చేసుకోనివ్వండి. ఎవరు ఎలా వ్యవహరించినా మేము మాత్రం ఏపీకి న్యాయం చేస్తాం. రైల్వే జోన్‌ ఏర్పాటు కూడా పరిశీలిస్తున్నాం' అని వ్యాఖ్యానించారని గీత చెప్పుకొచ్చారు.
 
తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పూర్తిగా న్యాయం చేస్తానని, ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఈ విషయంలో వెనుకడుగువేసేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారని ఆమె వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments