Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరుముకొస్తున్న "ఎక్స్ఈ'' ముప్పు... మాస్కులు తీయొద్దంటూ హెచ్చరిక

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (09:04 IST)
కరోనా వైరస్ మహమ్మారి తగ్గుముఖం పడుతుందని సంబరపడుతున్న వేళ మరో ముప్పు పొంచివుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్‌లోని మరో వేరియంట్ అయిన "ఎక్స్ఈ" నుంచి ముప్పు పొంచివుందని, ఇంది ప్రజలను మరింత భయపెడుతుందని అభిప్రాయపడుతున్నారు. అందువల్ల ప్రజలు విధిగా మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఈ "ఎక్స్ఈ" వైరస్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్. "బీఏ.1, బీఏ.2"ల మిశ్రమ వేరియంట్‌గా వెల్లడించారు. ఇది బీఏ.2 కంటే 10 శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో మాస్కుల వినియోగంపై నిర్లక్ష్యం వద్దని హెచ్చరిస్తున్నారు. 
 
మాస్కులు తీసే సమయం ముందు ఉందని, ఇప్పటికైతే వాటిని ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అదేసమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా "ఎక్స్ఈ" వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన విషయం తెల్సిందే. 
 
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా పురుడు పోసుకున్న చైనాలో రోజువారీగా నమోదయ్యే కేసులు సరికొత్త రికార్డును నెలకొల్పుతున్నాయి. అందువల్ల భారత్‌లోనూ మళ్లీ అది విజృంభించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని, అందువల్ల కొత్త కేసుల్లో పెరుగుదల కనిపించనంతవరకు కొవిడ్ నిబంధనలు పాటించాలని వైద్య నిపుణులు ఆయా ప్రభుత్వాలకు సలహా ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభద్రతా భావంలో సల్మాన్ ఖాన్ ... భద్రత రెట్టింపు - బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనం దిగుమతి!!

జానీ మాస్టర్ మంచివారు.. నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి? అని మాస్టర్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments