ఆ మహిళ 15 యేళ్లుగా తెలుసు... తనకు చెల్లిలాంటిది : సిద్ధరామయ్య

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (20:25 IST)
మైసూరులో జరిగిన కాంగ్రెస్ సభలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓ ముస్లిం మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ సభలో ముందు వరుసలో కూర్చొన్న ఆ మహిళ... ఏదో మాట్లాడబోతుంటే... ఆమెను ఆపే ప్రయత్నంలో భాగంగా, చేతిలోని మైక్ లాక్కున్నారు. అపుడు సిద్ధరామయ్య చేతి వేళ్ళకు తగులుకుని చున్నీ జారిపోయింది. 
 
అలాగే, ఆమె భుజాన్ని తాకి కింద కూర్పోబెట్టే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాంగ్రెస్ నేతలు మహిళను గౌరవించడం లేదనీ, వారిపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. దీంతో సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, ఆ సభలో మహిళా కార్యకర్త ప్రసంగాన్ని ఆపే ప్రయత్నంలో మైక్ లాక్కున్నానని చెప్పారు. ఆ సంఘటన అనుకోకుండా జరిగిపోయిందని వివరించారు. 'ఆమె నాకు 15 ఏళ్లుగా తెలుసు. నాకు తను చెల్లెలి లాంటిది. నాకు ఎటువంటి చెడు ఉద్దేశం లేదు' అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

తర్వాతి కథనం
Show comments