Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా: అలసిపోయిన గజరాజులు.. గాఢనిద్ర ఫోటోలు వైరల్

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (18:50 IST)
Elephant
చైనాలో జరిగిన ఓ దృశ్యం ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తోంది. చైనాలో తిరగాడిన గజరాజులు బాగా అలసిపోయి ఆదమరచి గాఢనిద్రలో వున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు ట్రెండింగ్‌లో నిలిచాయి. 
 
జూన్ మూడో తేదీ నైరుతి చైనాలోని, యునాన్ ప్రావిన్స్‌లోకి దాదాపు 15 ఏనుగులు గుంపుగా .. జనవాసాల్లోకి వచ్చాయి. ఈ ఏనుగుల గుంపు ఆహారం కోసం జనవాసాల్లోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. ఇలా ఆహారం కోసం 500 కిలోమీటర్లు నడక సాగించాయి. అయితే ప్రజలకు ఈ ఏనుగులు ఎలాంటి ఆటంకాలు కలిగించలేదు. 
 
వీటిని చూసిన అధికారులు అడవుల్లోకి ఏనుగులను తరలించే పనిలో పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. చైనా ప్రభుత్వ ఛానెల్‌లో ఏనుగుల గుంపును అడవికి పంపే దృశ్యాలను లైవ్‌గా ప్రసారం చేసింది.
Elephant
 
అడవిలోకి వెళ్లే క్రమంలో 15 ఏనుగులు.. అలసిపోయి.. గాఢంగా నిద్రపోయాయి. ఆ గుంపులో పెద్ద ఏనుగులు నిద్రిస్తుంటే ఓ గున్న ఏనుగు ఆడుకుంటున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments