Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు కరోనా సోకడం మంచిదే : ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (09:46 IST)
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) అధిపతి రణ్‌దేప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదంగా మారాయి. కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. ముఖ్యంగా, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సలహా ఇస్తున్నాయి. అయితే, రణ్‌దీప్ గులేరియా మాత్రం పిల్లలు వైరస్ బారిన పడటం మంచిదేనని అంటున్నారు. దీనివల్ల చాలామంది పిల్లల్లో సహజ రోగనిరోధక శక్తి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. 
 
అంతేకాకుండా, ఆయా రాష్ట్రాల్లోని స్థానిక పరిస్థితులను బేరీజువేసి దశలవారీగా విద్యా సంస్థలను తెరుచుకోవచ్చని, స్కూల్స్ మూసివేత పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. కేసులు తక్కువగా ఉన్న జిల్లాలలో స్కూల్స్ తెరువవచ్చని కరోనా పాజిటివ్ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాలలో ఓపెన్ చేయటానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.
 
అదేసమయంలో ఒక వేళ కరోనా కేసులు పెరిగిన పక్షంలో స్కూల్స్‌ను మూసివేయడం, రోజు విడిచి రోజు స్కూళ్లకు విద్యార్థులను రప్పించటం వంటి పద్ధతులను పాటించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. ముఖ్యంగా, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి స్కూళ్లలో ఉండాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments