Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాంతక వ్యాధిగా మారిన డెంగీ... వ్యాక్సిన్ కావాలంటున్న సైంటిస్టులు

Dengue
Webdunia
మంగళవారం, 2 మే 2023 (11:05 IST)
డెంగీ వైరస్ తన రూపు మార్చుకుంటుంది. దీంతో ప్రస్తుతం ఇది ప్రాణాంతక వ్యాధిగా మారింది. ఈ వ్యాధి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడాలంటే అర్జెంటుగా వ్యాక్సిన్ కావాలని సైంటిస్టులు కోరుతున్నారు. తాజాగా జరిగిన ఓ పరిశోధనలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. 
 
భారత్‌లోని డెంగీ వైరస్ కొత్త రూపు దాల్చినట్టు పేర్కొంది. దీన్ని కట్టడి చేయాలంటే తక్షణం ఒక వ్యాక్సిన్ అవసరమని తెలిపింది. గత ఆరు దశాబ్దాలుగా దేశంలో నమోదైన డెంగీ డేటాను విశ్లేషించి ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
 
ఈ అధ్యయనంలో పలు సంస్థలు పాలుపంచుకున్నాయి. డెంగీ కేసులు గత 50 యేళ్లుగా నిలకడగా పెరుగుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధనలో భాగంగా సైంటిస్టులు డెంగీ వైరస్‌కు చెందిన నాలుగు సీరోటైప్‌లపై అధ్యయనం చేశారు. తమ పూర్వ వేరియంట్లతో పోల్చతే ఈ సీరోటైప్‌లు ఎంత మేర రూపాంతరం చెందుతాయన్నది పరిశోధించారు. ఈ పరిశోధన వివరాలను ఓ సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. 
 
ఐఐఎస్‌సీ పరిశోధకులు భారతీయ డెంగీ స్ట్రెయిన్‌ల నుంచి 408 జెనెటిక్ సీక్వెన్స్‌లను పరిశీలించారు. ఈ సీక్వెన్స్‌లు 1956 నుంచి 2018 మధ్య కాలంలో సేకరించారు. ప్రస్తుతం కొత్తగా రూపాంతరం చెందిన డెంగీ వైరస్‌ను అడ్డుకునేందుకు అర్జెంటుగా వ్యాక్సిన్ కావాలని సైంటిస్టులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments