Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాంతక వ్యాధిగా మారిన డెంగీ... వ్యాక్సిన్ కావాలంటున్న సైంటిస్టులు

Webdunia
మంగళవారం, 2 మే 2023 (11:05 IST)
డెంగీ వైరస్ తన రూపు మార్చుకుంటుంది. దీంతో ప్రస్తుతం ఇది ప్రాణాంతక వ్యాధిగా మారింది. ఈ వ్యాధి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడాలంటే అర్జెంటుగా వ్యాక్సిన్ కావాలని సైంటిస్టులు కోరుతున్నారు. తాజాగా జరిగిన ఓ పరిశోధనలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. 
 
భారత్‌లోని డెంగీ వైరస్ కొత్త రూపు దాల్చినట్టు పేర్కొంది. దీన్ని కట్టడి చేయాలంటే తక్షణం ఒక వ్యాక్సిన్ అవసరమని తెలిపింది. గత ఆరు దశాబ్దాలుగా దేశంలో నమోదైన డెంగీ డేటాను విశ్లేషించి ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
 
ఈ అధ్యయనంలో పలు సంస్థలు పాలుపంచుకున్నాయి. డెంగీ కేసులు గత 50 యేళ్లుగా నిలకడగా పెరుగుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధనలో భాగంగా సైంటిస్టులు డెంగీ వైరస్‌కు చెందిన నాలుగు సీరోటైప్‌లపై అధ్యయనం చేశారు. తమ పూర్వ వేరియంట్లతో పోల్చతే ఈ సీరోటైప్‌లు ఎంత మేర రూపాంతరం చెందుతాయన్నది పరిశోధించారు. ఈ పరిశోధన వివరాలను ఓ సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. 
 
ఐఐఎస్‌సీ పరిశోధకులు భారతీయ డెంగీ స్ట్రెయిన్‌ల నుంచి 408 జెనెటిక్ సీక్వెన్స్‌లను పరిశీలించారు. ఈ సీక్వెన్స్‌లు 1956 నుంచి 2018 మధ్య కాలంలో సేకరించారు. ప్రస్తుతం కొత్తగా రూపాంతరం చెందిన డెంగీ వైరస్‌ను అడ్డుకునేందుకు అర్జెంటుగా వ్యాక్సిన్ కావాలని సైంటిస్టులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments