చంద్రబాబు కోసం ఎద్దు కాస్త గోమాతగా మారిపోయింది.. నెట్టింట సెటైర్లు

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (17:57 IST)
ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్దీ సోషల్ మీడియా వేదికగా అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసాయి. ఒకరి వైఫల్యాలను మరొక పార్టీ వారు ఎత్తి చూపుతూ, తదుపరి అవకాశం ఇవ్వవలసిందిగా ఓటర్లను వేడుకుంటున్నారు. తాజాగా టీడీపీకి చెందిన ప్రచార ప్రకటనపై బీజేపీ ట్విట్టర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. 
 
వివరాల్లోకెళితే..టీడీపీ తన ఎన్నికల ప్రచార ప్రకటన కోసం ఎద్దును ఏకంగా గోమాతను చేసేసారని బీజేపీ ఎద్దేవా చేసింది. సీఎం చంద్రబాబు వల్ల తాను గోమాతను కొనుగోలు చేసినట్లు ఓ మహిళ చెబుతున్నట్లు రూపొందించిన టీడీపీ ప్రచార ప్రకటనలో.. గోమాత స్థానంలో ఎద్దు ఉండటాన్ని బీజేపీ శుక్రవారం ట్విట్టర్‌ ద్వారా ట్వీట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోను పోస్ట్ చేసింది. 
 
రోజూ టీడీపీ చేస్తున్న తప్పులు చూపించలేక తాము కూడా విసిగిపోతున్నామంటూ బీజేపీ పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ ఫోటో ఇప్పుడు సోషియల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రకటన తీసిన దర్శకుడికి ఆవుకి, ఎద్దుకి తేడా తెలియదా అని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. 
 
అంతేకాకుండా ఎద్దును గోమాత అని చెప్పి మోసం చేస్తున్నారని మరికొంత మంది విమర్శిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఏ విషయం జరిగినా అది కాస్తా సోషియల్ మీడియాలో ప్రాచుర్యాన్ని పొందుతుండడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mardaani 3: రాణి ముఖర్జీ నటిస్తున్న మర్దానీ 3 విడుదల తేదీ ప్రకటన

Samyuktha: బయోపిక్స్, కామెడీ క్యారెక్టర్స్ వంటి అన్ని రకాల పాత్రలంటే ఇష్టం : సంయుక్త

Maheshbabu: మహేష్ బాబు లాంచ్ చేసిన శ్రీనివాస మంగాపురం లోని జయ కృష్ణ ఫస్ట్ లుక్

Aishwarya Rajesh: ఓ..! సుకుమారి నుంచి దామినిగా ఐశ్వర్య రాజేష్ లుక్

AniL Ravipudi: సంక్రాంతి ముద్ర పడటం కూడా మంచిది కాదు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

2026 మకర సంక్రాంతి: కాలిఫోర్నియా బాదంతో వేడుకలకు పోషకాలను జోడించండి

వినూత్నమైన ఫ్యాషన్ షోకేస్‌లను నిర్వహించిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2025

చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments