Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ అమ్ముకుని.. 23 దేశాలు తిరిగొచ్చిన వృద్ధ జంట.. ఎలాగంటే?

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (16:14 IST)
ఆధునికత పెరిగిన తరుణంలో చిన్న విషయాలకు విడాకుల వరకు తీసుకెళ్లే జంటలు పెరిగిపోతున్నాయి. అలాంటి వారు ఈ వృద్ధ జంట గురించి తెలిస్తే షాకవక మానరు. 70ఏళ్ల వయస్సులో ఈ దంపతులు 23 దేశాలు తిరిగొచ్చారు. 23 దేశాలు తిరిగొచ్చారే వారి వద్ద భారీగా ఆస్తులున్నాయని అనుకుంటున్నారా.. అయితే పప్పులో కాలేసినట్టే. 
 
ఆ వృద్ధ జంట వద్ద ఆస్తుల్లేవు. ఒక్కే ఒక్క టీ కొట్టు మాత్రమే వుంది. ఆ టీ కొట్టును ఆధారంగా చేసుకుని విదేశాలు తిరిగొస్తారు. తిరిగొచ్చాక ఆ అప్పును తీర్చుకుంటారు. ఇది ఆ 70 ఏళ్ల వృద్ధ దంపతుల కథ. కేరళలోని కొచ్చి నగరంలో గిరినగర్‌లో శ్రీ బాలాజీ కాఫీ హౌస్‌ను విజయన్, ఆయన భార్య మోహన కలిసి నడుపుతున్నారు.
 
24 గంటల పాటు కష్టపడి టీ కొట్టును నిర్వహించే ఈ జంట.. విదేశాలకు ట్రిప్పేసే ముందు.. టీ కొట్టుని బ్యాంకుకు తనఖా పెట్టి అప్పు తీసుకుంటారు. తిరిగొచ్చాక కష్టపడి ఆ అప్పు కట్టేస్తారు. రెండు, మూడేళ్లు కష్టపడి అప్పు తీర్చాక మరో పర్యటనకు సిద్ధమవుతారు. 
 
వీళ్ల గురించి తెలుసుకున్న మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర.. ఈ జంట గురించి ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. దేశంలోని అత్యంత ధనికులు వీళ్లేనని.. కొచ్చికి వెళ్లినపుడు విజయన్ టీకొట్టుకు వెళ్లి టీ తాగి వస్తానని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments