Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణిగుంటలో దిగిన చైనీయులను చూసి పారిపోయిన ఆటో, క్యాబ్ డ్రైవర్లు, జనం కూడా...

Webdunia
శుక్రవారం, 31 జనవరి 2020 (20:04 IST)
కరోనా వైరెస్ దెబ్బకు చైనా దేశస్తులను చూస్తే ప్రతి ఒక్కరూ జడుసుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంట విమానాశ్రయంలో చైనా నుంచి తమ పని నిమిత్తం పలువురు చైనీయులు విమానం ద్వారా చేరుకున్నారు. ఆ తర్వాత విమానాశ్రయం నుంచి బయటకు రాగానే వారిని చూసిన ఆటో, క్యాబ్ డ్రైవర్లు తమ వాహనాలను తీసుకుని పారిపోయారు. ఎక్కడ తమ వాహనాలను ఎక్కుతారోనని భయపడిపోయారు. 
 
దాంతో చైనా దేశస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటో, టాక్సీ డ్రైవర్లను బ్రతిమాలి ఎలాగైనా తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు చైనీయులు తంటాలు పడ్డారు. జనంతో మాట్లాడేందుకు ముందుకు వెళ్లిన చైనీయులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజలు కూడా వారిని చూసి పరుగులు పెట్టడం గమనార్హం.
 
విషయం తెలుసుకున్న పోలీసులు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బెంగళూరు నుంచి మొత్తం 15 మంది రేణిగుంటకు వచ్చినట్లు తెలుసుకుని వారికి కరోనా వైరస్ వున్నదో లేదో చెక్ చేసారు. ఆ తనిఖీలో వారికి కరోనా సంబంధ సమస్య ఏమీ లేదని తేలడంతో వారిని తమ గమ్య స్థానాలకు తీసుకుని వెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments