సీఎం జగన్ హత్యకు కుట్ర జరుగుతోంది: వైసిపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (16:32 IST)
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హత్యకు కుట్ర జరుగుతోందని అనంతపురం జిల్లా రాప్తాడు వైసిపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేసారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని హత్య చేసైనా అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోందన్న ఆయన, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. జగన్ మోహన్ రెడ్డి గాల్లోనే కలిసిపోతారని తీవ్ర వ్యాఖ్యలు చంద్రబాబు చేసారనీ, ఇటీవలి కాలంలో ఇలాంటి వ్యాఖ్యలు తెదెపా తరచూ చేస్తోందన్నారు.

 
అంతేకాదు... ఎమ్మెల్యేలు ముగ్గుర్ని చంపితే రూ. 50 లక్షలు రివార్డు ఇస్తానంటూ మల్లాది వాసు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.

 
ఎలాగైనా సీఎం జగన్ మోహన్ రెడ్డిని జైలుకు పంపి అధికారంలోకి రావాలని తెదేపా కుట్ర చేస్తోందని ప్రకాష్ అన్నారు. కాగా వైసిపి ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరి దీనిపై తెదేపా ఎలా స్పందిస్తుందో చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అద్భుత డ్యాన్స్ టాలెంట్‌తో అదరగొట్టిన బాలయ్య చిన్న కుమార్తె (వీడియో)

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

తర్వాతి కథనం
Show comments