జగన్ పైన కోడి కత్తితో దాడి... ఏం చెపుతారు? బాబుకు హైకోర్టు నోటీసులు

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (16:09 IST)
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైన విశాఖపట్టణం విమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే యువకుడు కోడి పందేల కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో జగన్ మోహన్ రెడ్డి తనపై దాడి జరగడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మరో 8 మందికి నోటీసులు జారీ చేసింది. జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై తమ యొక్క ప్రతిస్పందనను 15 రోజుల్లోపు తెలియజేయాలంటూ నోటీసులో పేర్కొంది. 
 
తమ యొక్క స్పందనను కూడా సీల్డ్ కవరులో వుంచి పంపాలని చెప్పిన కోర్టు తదుపరి విచారణను నవంబరు 27కి వాయిదా వేసింది. కాగా గత నెల 25న విశాఖ నుంచి హైదరాబాదుకు వెళ్తున్న జగన్ మోహన్ రెడ్డిపై శ్రీనివాసరావు అనే యువకుడు సెల్ఫీ తీసుకుంటానని చెప్పి అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ మోహన్ రెడ్డి భుజానికి తీవ్ర గాయమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments