Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పైన కోడి కత్తితో దాడి... ఏం చెపుతారు? బాబుకు హైకోర్టు నోటీసులు

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (16:09 IST)
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైన విశాఖపట్టణం విమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే యువకుడు కోడి పందేల కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో జగన్ మోహన్ రెడ్డి తనపై దాడి జరగడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మరో 8 మందికి నోటీసులు జారీ చేసింది. జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై తమ యొక్క ప్రతిస్పందనను 15 రోజుల్లోపు తెలియజేయాలంటూ నోటీసులో పేర్కొంది. 
 
తమ యొక్క స్పందనను కూడా సీల్డ్ కవరులో వుంచి పంపాలని చెప్పిన కోర్టు తదుపరి విచారణను నవంబరు 27కి వాయిదా వేసింది. కాగా గత నెల 25న విశాఖ నుంచి హైదరాబాదుకు వెళ్తున్న జగన్ మోహన్ రెడ్డిపై శ్రీనివాసరావు అనే యువకుడు సెల్ఫీ తీసుకుంటానని చెప్పి అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ మోహన్ రెడ్డి భుజానికి తీవ్ర గాయమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments