Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క ఫోన్ కాల్ చాలు... రాష్ట్రంలో కేంద్ర వాహనాలు ఒక్కటీ తిరగదు : చంద్రబాబు

తాను ఒక్క ఫోన్ కాల్ చేస్తే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏ ఒక్క వాహనం రాష్ట్రంలో తిరగదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం అమరావతిలో జరిగిన హ్యాపీ సిటీస్ సమిట్ ముగింపు కార్యక

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (18:42 IST)
తాను ఒక్క ఫోన్ కాల్ చేస్తే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏ ఒక్క వాహనం రాష్ట్రంలో తిరగదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం అమరావతిలో జరిగిన హ్యాపీ సిటీస్ సమిట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. హ్యాపీ సిటీస్ ఇనువేటన్ ల్యాబ్‌ను ఆవిష్కరించారు.
 
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఈ రోజున తాను ప్రభుత్వం తరపున ఒక్క కాల్ చేస్తే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలు ఏ ఒక్కటీ రాష్ట్రంలో తిరగవని... తనకు ఒక నిమిషం పని అని అన్నారు. కానీ దానివల్ల జాతి ఎంతో నష్టపోతుందని, రాష్ట్రం డైవర్ట్ అయిపోతుందని అన్నారు. 
 
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం... ఇప్పటికే అన్ని విధాలుగా కుంటుపడిందని, వేరే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్న సమయంలో... రాష్ట్రం ఇంకా కుంటుపడితే మళ్లీ ఎప్పుడు లోటును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. విపక్షాలు రాజకీయ లబ్ది కోసం రెచ్చగొడుతున్నాయని, ఆ పద్ధతి సరైనది కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
 
ఇకపోతే, కష్టాలను సవాళ్లుగా స్వీకరించడం భారతీయులకు తెలిసిన విద్య అని అన్నారు. భారత్‌లో ఎన్ని కష్టాలు ఉన్నా ప్రజలు నవ్వుతుంటారన్నారు. రాష్ట్రంలో మూడేళ్లుగా ఒక్కో కష్టాన్ని అధిగమిస్తూ వస్తున్నామని గుర్తు చేసిన చంద్రబాబు... జపాన్‌లో ఎన్నో సౌకర్యాలు, అవకాశాలు ఉంటాయి.. కానీ అక్కడి ప్రజల మొహంలో ఆనందం ఉండదని గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments