Webdunia - Bharat's app for daily news and videos

Install App

5జీ స్పెక్ట్రమ్ వేలానికి పచ్చజెండా ఊపిన కేంద్రం

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (14:56 IST)
దేశంలో ఐదో జనరేషన్ తరంగాల(5జీ) సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. 5జీ స్పెక్ట్రమ్స్ వేలానికి కేంద్రం పచ్చజెండా ఊపడంతో 5జీ సేవలు ప్రజలకు వినియోగానికి రానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహణకు కేంద్ర కేబినెట్ అనుమతి ఇచ్చింది. దీంతో జూలై నెలాఖరు నాటికి ఈ 5జీ సేవలు దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంటర్నెట్ సేవల వేగం ప్రస్తుతం ఉన్న వేగానికంటే పది రెట్లు ఎక్కువగా ఉంటాయి. 
 
దీనిపై కేంద్రం ఓ పత్రికా ప్రకటన చేసింది. "ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇతర కార్యక్రమాలకు డిజిటల్ కనెక్టివిటీ ప్రాధాన్యత అంశంగా ఉంది" అని పేర్కొంది. 
 
ప్రస్తుతం ఇంటర్నెట్, ముబైల్ బ్రాడ్ బ్యాండ్ సేవలు ప్రజల రోజువారీ జీవితాల్లో ఓ భాగమైపోయాయి. కాగా, దేశంలో గత 2015లో 4సీ సేవలు అందుబాటులోకి రాగా, ఈ సేవలు శరవేగంగా దేశంలో విస్తరించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం దేశంలో 4జీ సేవలను పొందుతున్న వారి సంఖ్య 80 కోట్ల వరకు ఉంమది. 2014లో ఈ సంఖ్య 10 కోట్లుగానే ఉండేదని కేంద్ర టెలికాం శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments