లాక్డౌన్ పొడగింపుపై నిర్ణయం తీసుకోలేదు.. పుకార్లు నమ్మొద్దు: కేంద్రం

Webdunia
బుధవారం, 27 మే 2020 (18:20 IST)
కరోనా వైరస్ మహమ్మారికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ అమల్లోవుంది. ఈ నాలుగో దశ లాక్డౌన్ ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ లాక్డౌన్‌ను మరోమారు పొడగించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, మరో రెండు వారాలపాటు అంటే జూన్ 14వ తేదీ వరకు ఈ లాక్డౌన్ పొడగించవచ్చనే రూమర్లు వినిపిస్తున్నాయి. 
 
వీటిపై కేంద్ర హోం శాఖ బుధవారం ఓ క్లారిటీ ఇచ్చింది. లాక్డౌన్ పొడగింపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. పైగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని దేశ ప్రజలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. 
 
కాగా, దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న ఢిల్లీ, ముంబై, థానే, పూణె, చెన్నై, బెంగుళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా, జైపూర్, సూరత్, ఇండోర్ వంటి ప్రాంతాలపై కేంద్ర ప్రత్యేక దృష్టినిసారించింది. ప్రస్తుతం దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 70 శాతం కేసులు నగరాల్లోనే నమోదైవున్నాయి. అందుకే ఈ నగరాల్లో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యలపై సీరియస్‌గా ఆలోచన చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments