కళ్లముందే కారు మాయం... చూస్తుండగానే భూమిలోకి కుంగిపోయిది.. (VideoViral)

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (07:57 IST)
నైరుతి రుతుపవనాల ప్రభావంతోపాటు... అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనద్రోణి ప్రభావం కారణంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. గత కొన్నిరోజులుగా కురుస్తున్న ఈ వర్షాలతో ముంబై నగరం తడిసి ముద్దయింది. 
 
ఈ వర్షాల ధాటికి ముంబై మహానగరంలో ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో నగరంలోని ఘట్కోపర్ ప్రాంతంలో ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. నిలిపి ఉంచిన కారు... ఒక్కసారిగా భూమి కుంగిపోవడంతో, ఆ గుంతలోకి జారిపోయింది. 
 
కుంగిన భూమిలో నీరు ఉబికి రాగా, ఆ నీటిలో కారు పూర్తిగా మునిగిపోవడం దిగ్భ్రాంతి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. అయితే ఆ కారుకు అటూ ఇటూ నిలిపి ఉంచిన వాహనాలు మాత్రం యథాతథంగా ఉన్నాయి.
 
దీనిపై ముంబై ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ఆ కారు నిలిపి ఉంచిన ప్రాంతంలో ఒకప్పుడు బావి ఉండేదని, కాలక్రమంలో దాన్ని మట్టితో నింపేశారని తెలిపారు. కొందరు దానిపై కాంక్రీట్ వేసి పార్కింగ్ ఏరియాగా మార్చుకున్నారని వెల్లడించారు. 
 
ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండడంతో, భూమి కుంగిపోయి ఉంటుందని వివరించారు. ఈ ఘటన జరిగిన సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments