Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు... 7 గంటల పాటు విచారణ

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు... 7 గంటల పాటు విచారణ
, మంగళవారం, 8 జూన్ 2021 (13:30 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ బృందంలోని అధికారులకు కరోనా వైరస్ సోకడంతో ఏడు నెలల పాటు ఈ కేసు విచారణ ఆగిపోయింది. ఇపుడు మళ్లీ మొదలైంది. 
 
ఆదివారం కడపకు చేరుకున్న సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక మాజీ డ్రైవర్ దస్తగిరిని ఏడు గంటలపాటు సుధీర్ఘంగా విచారించి, కీలక వివరాలు సేకరించినట్టు సమాచారం. ఆమధ్య దస్తగిరిని సీబీఐ ఢిల్లీకి పిలిపించి, నెల రోజులపాటు విచారించి, తిరిగి కడపకు పంపింది. తాజాగా మళ్లీ ఆయనను పిలిచిన అధికారులు సుదీర్ఘంగా విచారించడం గమనార్హం. 
 
వివేకానందరెడ్డి హత్యకు ఆరు నెలల ముందు ఉద్యోగం నుంచి మానేయడంపై అతనిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అలాగే, అతడి ఆర్థిక లావాదేవీల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాత్రి ఏడు గంటల సమయంలో పులివెందుల వెళ్లిన అధికారులు వివేకానంద రెడ్డి ఇంటి పరిసరాలను పరిశీలించారు. ఇదే కేసులో మరికొందరు అనుమానితులను సీబీఐ అధికారులు విచారించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లను వేధిస్తున్నారు: ఏపీ గవర్నర్ కు చంద్రబాబు లేఖ