Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిమండపానికి మెట్రో రైల్లో వెళ్లిన వధువు.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 19 జనవరి 2023 (09:51 IST)
దేశంలో ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాంటి నగరాల్లో బెంగుళూరు ఒకటి. ప్రతి రోజూ ఈ నగర వాసులకు ట్రాఫిక్ పగటిపూటే చుక్కలు చూపిస్తుంది. తాజాగా ఓ వధువుకు కూడా వింత అనుభవం ఎదురైంది. కళ్యాణ మండపానికి ఇంటి నుంచి కారులో బయలుదేరిన వధువుకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. దీంతో ఆమె మధ్యలోనే కారు దిగి మెట్రో రైలు ఎక్కారు. 
 
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉండటంతో ముహూర్త సమయానికి పెళ్లి మండపానికి చేరుకోలేనని భావించిన ఆ వధువు.. పెళ్ళి కుమార్తె ముస్తాబులోనే మెట్రో రైలు ఎక్కిసింది. ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి రైలెక్కిన ఆమెను చూసిన ఇతర ప్రయాణికులు నోరెళ్లబెట్టారు. 
 
అయితే, నెటిజన్లు మాత్రం వధువు సమయస్పూర్తిని కొనియాడుతున్నారు. స్మార్ట్ పెళ్ళికూతురు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆమెను ప్రశంసిస్తుంటే మరికొందరు మాత్రం ముహూర్త సమయానికే బయలుదేరడం ఏంటి.. కాస్త ముందుగా బయలుదేరవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ముహూర్త సమయాని ఆ వధువు మండపానికి చేరుకుని పెళ్లిపీటలపై కూర్చొని మెడలో మూడు ముళ్లు వేయించుకుంది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments