Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో అమ్మాయి.. స్కైప్ ద్వారా విడాకులిచ్చిన బాంబే హైకోర్టు

సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ ప్రభావంతో మానవీయ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ట్రిపుల్ తలాక్‌ నుంచి మహిళలకు విముక్తి లభించిన వేళ... పరస్పర అంగీకారంతో విడిపోతున్న ఓ ఎన్నారై జంటకు స్కైప్ ద్వారా విడాకులు ఇవ్

Webdunia
మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (09:15 IST)
సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ ప్రభావంతో మానవీయ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ట్రిపుల్ తలాక్‌ నుంచి మహిళలకు విముక్తి లభించిన వేళ... పరస్పర అంగీకారంతో విడిపోతున్న ఓ ఎన్నారై జంటకు స్కైప్ ద్వారా విడాకులు ఇవ్వాలంటూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. 2002లో జలగాంలో పెళ్లి చేసుకున్న ఓ జంట 2016 నుంచి విడిపోయారు.
 
ఈ నేపథ్యంలో తమకు విడాకులు ఇవ్వాల్సిందిగా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కానీ మహిళ కోర్టుకు హాజరుకాకపోవడంతో విడాకుల కోసం వారు పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఉద్యోగ రీత్యా మహిళ అమెరికాలో ఉండడంతో ఆమె కోర్టుకు హాజరు కావడం వీలుకాలేదని ఆమె తరపు న్యాయవాది సమీర్ వైద్య చెప్పారు. ఇంకా పిటిషన్‌‍ను కోర్టు కొట్టివేయడంతో వారు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 
 
సాంకేతికత అభివృద్ధి చెందిన నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడాకులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం స్కైప్ ద్వారా విడాకులు ఇచ్చేందుకు అంగీకరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమకంటే పెద్దవారైన ఆంటీలతో అబ్బాయిలు శృంగారం.. అనసూయ షాకింగ్ కామెంట్స్

నేను కొంచెం ఒత్తిడికి గురైనా, ఆమె దానిని గమనిస్తుంది.. నాగ చైతన్య

అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రం అప్ డేట్

45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శంకరాభరణం

60 ఏళ్ల వయసులో బెంగళూరు యువతిని ప్రేమించిన బాలీవుడ్ గజిని అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments