Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ జింకల కేసు : ఆ హీరో దోషి.. ఇద్దరు హీరోయిన్లు నిర్దోషులు

కృష్ణ జింకల కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ దోషిగా తేలారు. అదే సమయంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, బాలీవుడ్ నటి సోనాలీ బింద్రేలు నిర్దోషులుగా తేలారు. ఈ మేరకు జోధ్

Webdunia
గురువారం, 5 ఏప్రియల్ 2018 (11:47 IST)
కృష్ణ జింకల కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ దోషిగా తేలారు. అదే సమయంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, బాలీవుడ్ నటి సోనాలీ బింద్రేలు నిర్దోషులుగా తేలారు. ఈ మేరకు జోధ్‌పూర్ కోర్టు గురువారం తీర్పునిచ్చింది. 
 
గత 1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రం షూటింగ్ నిమిత్తం జోధ్‌పూర్ పరిసర ప్రాంతాలకు వెళ్లిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడాడు. దీనిప కేసు నమోదు చేయగా, ఈ కేసు విచారణ కొన్నేళ్లుగా సాగుతూ వచ్చింది. ఈ కేసును విచారిస్తూ వచ్చిన కోర్టు గురువారం తీర్పును వెలువరించింది. ఇందులో సల్మాన్ ఖాన్ దోషేనని తేల్చింది. 
 
అదేసమయంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు సైఫ్ అలీ ఖాన్, సీనియర్ నటీమణులు సోనాలీ బింద్రే, టబు సహా ఐదుగురు నిర్దోషులని, వారు వేటాడలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. జింకలను చంపడం ఏమాత్రం మానవత్వం కాదని జడ్జి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జింకలను సల్మాన్ కాల్చినట్టు ప్రాసిక్యూషన్ నిరూపించిందని చెప్పారు. మరోవైపు, ఈ కేసులో అప్పీల్ చేసేందుకు సల్మాన్ తరపు న్యాయవాదులు సిద్ధమయ్యారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments