Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ హరిబాబు ఎందుకు రిజైన్ చేశారంటే...

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా విశాఖపట్టణం ఎంపీ కంభంపాటి హరిబాబు ఉన్నారు. ఈయన ఉన్నట్టుండి తన పదివికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోమవారం సాయంత్రం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా

Webdunia
మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (12:57 IST)
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా విశాఖపట్టణం ఎంపీ కంభంపాటి హరిబాబు ఉన్నారు. ఈయన ఉన్నట్టుండి తన పదివికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోమవారం సాయంత్రం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపించారు.
 
అయితే, హరిబాబు రాజీనామా లేఖ ఇపుడు బీజేపీ కలకలం రేపింది. ఉన్నట్టుండి ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తే, గత కొన్ని రోజులుగా ఏపీలో టీడీపీకి, బీజేపీకి మధ్య వైరం నెలకొంది. దీంతో బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంది. 
 
ఆ తర్వాత టీడీపీపై బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. కానీ, హరిబాబు మాత్రం టీడీపీ నేతలు లేదా టీడీపీ అధినేత చంద్రబాబును పల్లెత్తుమాట అనలేదు. దీంతో సొంత పార్టీలోనే హరిబాబుబై విమర్శలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. దీంతో కొత్త అధ్యక్షుడి ఎన్నికకు వీలుగా కంభంపాటి రాజీనామా చేశారు. కర్ణాటక ఎన్నికల తర్వాత పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించనున్నట్లు సమాచారం. అందుకు మార్గం సుగమం చేసేందుకునే కంభంపాటి రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments