Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ హరిబాబు ఎందుకు రిజైన్ చేశారంటే...

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా విశాఖపట్టణం ఎంపీ కంభంపాటి హరిబాబు ఉన్నారు. ఈయన ఉన్నట్టుండి తన పదివికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోమవారం సాయంత్రం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా

Webdunia
మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (12:57 IST)
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా విశాఖపట్టణం ఎంపీ కంభంపాటి హరిబాబు ఉన్నారు. ఈయన ఉన్నట్టుండి తన పదివికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోమవారం సాయంత్రం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపించారు.
 
అయితే, హరిబాబు రాజీనామా లేఖ ఇపుడు బీజేపీ కలకలం రేపింది. ఉన్నట్టుండి ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తే, గత కొన్ని రోజులుగా ఏపీలో టీడీపీకి, బీజేపీకి మధ్య వైరం నెలకొంది. దీంతో బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంది. 
 
ఆ తర్వాత టీడీపీపై బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. కానీ, హరిబాబు మాత్రం టీడీపీ నేతలు లేదా టీడీపీ అధినేత చంద్రబాబును పల్లెత్తుమాట అనలేదు. దీంతో సొంత పార్టీలోనే హరిబాబుబై విమర్శలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. దీంతో కొత్త అధ్యక్షుడి ఎన్నికకు వీలుగా కంభంపాటి రాజీనామా చేశారు. కర్ణాటక ఎన్నికల తర్వాత పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించనున్నట్లు సమాచారం. అందుకు మార్గం సుగమం చేసేందుకునే కంభంపాటి రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments