చేతులతో మరుగుదొడ్డిని శుభ్రం చేసిన ఎంపీ!

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (19:02 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ ఒకరు ఒట్టి చేతులతో పాఠశాల మరుగుదొడ్డిని శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ రాష్ట్రంలోని గణ జిల్లా చక్‌దేవ్‌పూర్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను 5-6 తరగతులు చదువుతున్న బాలికలతో గత మంగళవారం శుభ్రం చేయించారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో కూడా రేవా జిల్లాలో కూడా ఇటీవల ఇలాంటి సంఘటన జరిగింది. 
 
ఈ నేపథ్యంలో రేవా బీజేపీ ఎంపీ జనార్థన్ మిశ్రా తాజాగా ఓవరాక్షన్ చేశారు. ఆ పార్టీ నిర్వహిస్తున్న సేవా పఖ్‌వాడ కార్యక్రమంలో భాగంగా, ఖత్‌ఖారీలోని ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. 
 
అక్కడ మొక్కలు నాటిన తర్వాత అపరిశుభ్రంగా ఉన్న స్కూలు మరుగుదొడ్డిని ఒట్టి చేతులతో శుభ్రం చేశారు. అంతేకాకుండా, ఈ వీడియోను ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి, దాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు ట్యాగ్ చేశారు.
 
మరోవైపు, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయితే, ఒట్టి చేతులతో స్కూల్ టాయిలెట్‌‍ను క్లీన్ చేసిన బీజేపీ ఎంపీ జనార్థన్ మిశ్రాపై ఓవరాక్షన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదొక రాజకీయ స్టంట్ అని, స్కూలు పిల్లలతో టాయిలెట్ క్లీనింగ్‌ను కప్పిపుచ్చుకునేందుకే ఆయన ఇలా చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments