Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ మేనల్లుడుని చంపేస్తాం...ఏం చేస్తారు? మమతా బెనర్జీకి వార్నింగ్

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బీజేపీ నేత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన పేరు నిర్మల్ చంద్ర. మీ మేనల్లుడుని చంపేస్తే ఏం చేస్తారంటూ హెచ్చరించారు. పైగా, ఒక్క బీజేపీ కార్యకర్తను చంపితే మేము ఇద

Webdunia
ఆదివారం, 5 ఆగస్టు 2018 (13:25 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బీజేపీ నేత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన పేరు నిర్మల్ చంద్ర. మీ మేనల్లుడుని చంపేస్తే ఏం చేస్తారంటూ హెచ్చరించారు. పైగా, ఒక్క బీజేపీ కార్యకర్తను చంపితే మేము ఇద్దర్నీ చంపుతామంటూ బహిరంగంగా బెదిరించాడు.
 
కోల్‌కతా: బీజేపీ నేత నిర్మల్ చంద్ర మండల్ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీని బెదిరిస్తూ కెమెరాకు చిక్కారు. కేరళ తరహా హింసాకాండను ప్రేరేపిస్తూ 'ఒక బీజేపీ కార్యకర్తను సీపీఎం చంపితే మేము ఇద్దర్ని చంపుతాం' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
బిర్‌భూమ్‌లోని సూరిలో ఎస్‌పీ కార్యాలయం ఎదుట జరిపిన ప్రదర్శనలో చంద్ర మండల్ మాట్లాడుతూ... 'దీదీ...మీ మేనల్లుడు హత్యకు గురైతే మీరేం చేస్తారు?' అంటూ నిలదీశారు. కేరళలో తమ కార్యకర్తలు హత్యకు గురైనప్పుడల్లా ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంటామని ప్రకటించారు. 
 
ఒక బీజేపీ కార్యకర్తను సీపీఎం కార్యకర్తలు చంపితే, తాము ఇద్దర్నీ చంపుతామని హెచ్చరించారు. కెమెరాలో తాను మాట్లాడిన ప్రతి మాట రికార్డు అవుతోందని తెలిసినప్పటికీ బీర్‌భూమ్ జిల్లా బీజేపీ విభాగం నేత అయిన చంద్ర మండల్ రెచ్చిపోయారు.
 
'మా నేత శ్యాంప్రసాద్ ముఖర్జీ (అశుతోష్ ముఖర్జీ తనయుడు) మాకు చెప్పిందొకటే. తప్పును ఖండించమన్నారు. అవసరమైతే ప్రతీకారం తీర్చుకోమన్నారు. మేమిప్పుడు ప్రతీకారం తీర్చుకుంటాం. ఆర్ఎస్ఎస్ వ్యక్తులతో కూడిన సంస్థ. 
 
సీపీఎం హంతకుల పార్టీ. వారు కేరళలో మాతో పోరాటం చేస్తున్నారు. వారు మాలో ఒక కార్యకర్తను చంపితే మేము ప్రతీకార చర్యగా ఇద్దర్ని చంపుతాం. ఇప్పుడు అలాంటి హింసే ఇక్కడ చోటుచేసుకోనుంది' అంటూ చంద్ర మండల్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments