రజనీ బీజేపీకి కొమ్ముకాస్తున్నారు.. తమిళ లారీ డ్రైవర్‌పై దాడి జరిగినప్పుడు?

దశాబ్ధాలుగా కర్ణాటక, తమిళనాడు ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తున్న కావేరి జలాల పంపిణీ వివాదంపై ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్రిక్తలకు దారితీసింది. తమిళనాడుకు లభ

Webdunia
ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (12:40 IST)
దశాబ్ధాలుగా కర్ణాటక, తమిళనాడు ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తున్న కావేరి జలాల పంపిణీ వివాదంపై ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్రిక్తలకు దారితీసింది. తమిళనాడుకు లభిస్తున్న జలాలను 192 టీఎంసీల నుండి 117.25 టీఎంసీలకు, అంటే 14.5 టీఎంసీ మేర తగ్గిస్తూ, ఈ నదీ పరివాహక ప్రాంతంలో లేని బెంగళూరు నగరానికి అదనంగా 4.75 టియంసిల మేరకు కేటాయిస్తూ తీర్పు ఇచ్చింది.
 
నీటి కొరతను భూగర్భజలాలను అన్వేషించడం ద్వారా భర్తీచేసుకోమని తమిళనాడుకు సలహా ఇచ్చింది. అయితే కావేరీ జలాలపై కేంద్రం బోర్డు ఏర్పాటు చేయాలని రాజకీయ పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు సినీ తారలు ఆందోళన బాట పట్టారు. కావేరి బోర్డు ఏర్పాటుచేయాలంటూ తమిళనాట గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
 
ఈ ఆందోళనల్లో ఓ పోలీసు గాయపడ్డారు. దీనిపై స్పందించిన రజనీకాంత్‌ విధిలో ఉన్న పోలీసులపై దాడి చేయడం బాధాకరమని.. అలా చేసే వారికి శిక్షించాలని అన్నారు. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ బీజేపీకి కొమ్ముకాస్తున్నారని సినీ దర్శకుడు భారతీ రాజా విమర్శించారు. 
 
కావేరి బోర్డు ఏర్పాటు కోసం చేసిన ఆందోళనలు ఏవీ హింసాత్మకం కాదని, అనుకోకుండా కొన్ని అనూహ్య సంఘటనలు జరిగాయని భారతీరాజా అన్నారు. ఇదే రజనీ కాంత్ కర్ణాటకలో తమిళ లారీ డ్రైవర్‌పై దాడి చేసినప్పుడు ఎందుకు ఖండించలేదని అడిగారు. ఇక రజనీ వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై స్వాగతించడం చూస్తుంటే ఆయన బీజేపీకి కొమ్ముకాస్తున్నట్లు అర్థమవుతోందని విమర్శించారు. తమది భవిష్యత్ తరాల కోసం చేసే పోరాటమన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AA22: స్పైడర్-మ్యాన్, అవెంజర్స్ తరహాలో AA22 చిత్రం ఉండబోతుందా ?

K. Raghavendra Rao: మహిళలకు డైమండ్ డెకాయిట్ చిత్రం ఉచితం

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్-లెంగ్త్ ఎంటర్టైనర్ : ప్రొడ్యూసర్ శివప్రసాద్

VV Vinayak: వివేక్ మిశ్రా, శృతిక జంటగా అహోం.ప్రారంభం

AA22 x A6 ప్రీ లుక్ పోస్టర్‌.- అంచనాలు రెట్టింపు చేసిన టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

తర్వాతి కథనం
Show comments