Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ బంద్ : దేశవ్యాప్తంగా ఎఫెక్టు - కేరళలో తీవ్రం.. నిలిచిన బ్యాంకు సేవలు

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (12:19 IST)
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కార్మిక సంఘాలు రెండు రోజుల సమ్మెకు దిగాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా ప్రజా రవాణాతో పాటు బ్యాంకు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా, ఇప్పటికే శబరిమల వివాదంతో అట్టుడికిపోతున్న కేరళ రాష్ట్రంలో ఈ బంద్ ప్రభావం తీవ్రంగా ఉంది. 
 
ఈ బంద్‌లో ఐఎన్‌టీయూసీ ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూతో పాటు 10కి పైగా కార్మిక సంఘాలు, వాటి అనుబంధ సంఘాలు ఈ సమ్మెకు మద్దతు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడింది. అనేక రాష్ట్రాల్లో రైళ్లు, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వామపక్ష ప్రభావం అధికంగా ఉండే రాష్ట్రాల్లో బంద్ ఉధృతంగా సాగుతోంది. 
 
సర్కారీ కొలువుల్లో కనిష్ట వేతనం రూ.18 వేలుగా నిర్ణయించాలని, పబ్లిక్ రంగ షేర్లను విక్రయించడాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ భారత్ బంద్ కారణంగా వెస్ట్ బెంగాల్, ఒడిషా, కేరళ రాష్ట్రాల్లో ప్రజాసేవలన్నీ స్తంభించిపోయాయి. ఆందోళనకారులు రోడ్లను బ్లాక్ చేసి, బస్సు సర్వీసులను అడ్డుకుంటున్నారు. అలాగే, రైళ్ళు కూడా నడవకుండా రైల్ రోకోలకు దిగారు. సెంట్రల్ ట్రేడ్ యూనియన్‌కు చెందిన 20 కోట్ల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments