Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ ఎమ్మెల్యేకు బాలకృష్ణ ఫోన్, నేను ఎన్టీఆర్ అభిమానినే అన్న ఎమ్మెల్యే

Webdunia
గురువారం, 23 జులై 2020 (16:01 IST)
నెల్లూరు జిల్లా కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగించిన అంశం నిప్పు రాజేసిన సంగతి తెలిసిందే. దీన్ని సీరియస్‍గా తీసుకోవాలని నెల్లూరు నాయకులకు చంద్రబాబు సూచనలు కూడా చేశారు. పెద్దఎత్తున పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేసి 'చలో కావలి' అంటూ పిలుపు ఇవ్వాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు.
 
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావాలనే విగ్రహాన్ని తొలగించారని దీనికి పోలీసులు కూడా సహకరించారని నెల్లూరు జిల్లా పార్టీ నేతలు చంద్రబాబుకు తెలియజేశారు. అయితే తాజాగా ఇదే అంశం గురించి ఎన్.టి.ఆర్ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ , వైసీపీ పార్టీకి చెందిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కు ఫోన్ చేసి విగ్రహం తొలగించాల్సిన అవసరం ఏముందని ఆరా తీశారు.
 
అయితే ఎన్టీఆర్ విగ్రహం యొక్క వీపు భాగం ఆలయానికి ఎదురుగా ఉన్నందున స్థానికులు తొలగించడం జరిగిందని, వివాదస్పదం కాని స్థలంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని బాలకృష్ణకు హామీ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్. తాను కూడా చిన్ననాటి నుంచే ఎన్టీఆర్ అభిమానిని అని బాలకృష్ణకు తెలియజేయడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments