వైసీపీ ఎమ్మెల్యేకు బాలకృష్ణ ఫోన్, నేను ఎన్టీఆర్ అభిమానినే అన్న ఎమ్మెల్యే

Webdunia
గురువారం, 23 జులై 2020 (16:01 IST)
నెల్లూరు జిల్లా కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగించిన అంశం నిప్పు రాజేసిన సంగతి తెలిసిందే. దీన్ని సీరియస్‍గా తీసుకోవాలని నెల్లూరు నాయకులకు చంద్రబాబు సూచనలు కూడా చేశారు. పెద్దఎత్తున పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేసి 'చలో కావలి' అంటూ పిలుపు ఇవ్వాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు.
 
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావాలనే విగ్రహాన్ని తొలగించారని దీనికి పోలీసులు కూడా సహకరించారని నెల్లూరు జిల్లా పార్టీ నేతలు చంద్రబాబుకు తెలియజేశారు. అయితే తాజాగా ఇదే అంశం గురించి ఎన్.టి.ఆర్ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ , వైసీపీ పార్టీకి చెందిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కు ఫోన్ చేసి విగ్రహం తొలగించాల్సిన అవసరం ఏముందని ఆరా తీశారు.
 
అయితే ఎన్టీఆర్ విగ్రహం యొక్క వీపు భాగం ఆలయానికి ఎదురుగా ఉన్నందున స్థానికులు తొలగించడం జరిగిందని, వివాదస్పదం కాని స్థలంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని బాలకృష్ణకు హామీ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్. తాను కూడా చిన్ననాటి నుంచే ఎన్టీఆర్ అభిమానిని అని బాలకృష్ణకు తెలియజేయడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments